Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలు గారి చేత తొలిసారి అన్నమయ్య కీర్తనలు పాడించిన శోభారాజు

Webdunia
శనివారం, 26 సెప్టెంబరు 2020 (20:24 IST)
పద్మశ్రీ డా. శోభారాజు గారితో శ్రీ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం అనుబంధం ప్రత్యేకమైనది. 1979వ సంవత్సరంలో శోభారాజు తిరుమల తిరుపతి దేవస్థానంలో మొట్టమొదటి కళాకారిణిగా నియమించబడినపుడు, అన్నమయ్య జీవిత విశేషాలను జనబాహుళ్యంలోకి తీసుకువెళ్ళాలని సంకల్పించి ఆయన జీవిత కథాంశాన్ని "అన్నమయ్య కథ" పేరిట స్వయంగా రచించి, సంగీత దర్శకత్వం వహించి ఒక సంగీత రూపకంగా రూపొందించారు.
 
అప్పుడు తను పాడకుండా అభిమాన గాయనీగాయకులైన బాలు, శ్రీమతి పి.సుశీలలచే పాడించారు. అలా మొదటిసారి బాలు గారు "విన్నపాలు వినవలె వింతవింతలు, సకలం హేసఖి జానామి, ఇందిరా రమణు తెచ్చి, నానాటి బ్రతుకు" వంటి కీర్తనలు ఆలపించారు. స్వయంగా బాలు గారు "నేను మొదటిసారి అన్నమయ్య కీర్తనలు పాడుతున్నాను" అని అన్నారట.
 
శోభారాజు గారు "బాలు అన్నయ్య ఎంతో భక్తిశ్రద్ధలతో నేర్చుకొని ఆలపించారు. ఆయనతో అన్నమయ్య కీర్తనలు పాడించే అవకాశం నాకు దక్కింది. అలాంటి గాయకుడు ఇక రారు కదా." అని బాలు గారితో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments