Webdunia - Bharat's app for daily news and videos

Install App

కయ్యానికి కాలు దువ్వుతున్నారు... కనుసైగ చేస్తే చాలు.. : బిపిన్ రావత్

Webdunia
సోమవారం, 30 సెప్టెంబరు 2019 (11:32 IST)
దాయాది దేశం పాకిస్థాన్ కయ్యానికి కాలుదువ్వుతున్నారని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అన్నారు. అయితే, తాము సిద్ధంగానే ఉన్నామనీ, కనుసైగ చేస్తే తమ బలగాలు దూసుకెళ్తాయని చెప్పారు. అమెరికా పర్యటన ముగించుకుని ఆదివారం స్వదేశానికి చేరుకున్న పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ విమానాశ్రయంలో పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ కాశ్మీరీలు జిహాద్‌ (పవిత్ర యుద్ధం) చేస్తున్నారని, పాకిస్థాన్‌ వారికి అండగా ఉంటే వారు విజయం సాధిస్తారన్నారు. 
 
ఈ వ్యాఖ్యలపై భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ మండిపడ్డారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో పాకిస్థాన్‌ దాగుడుమూతలు ఆడుతోందన్నారు. ఇటువంటి చర్యలు ఎల్లకాలం సాగవని, మెరుపుదాడులతో భారత్‌ ఏంటో ఆ దేశానికి ఇప్పటికే తెలిసి వచ్చిందని గుర్తుచేశారు. 
 
పాకిస్థాన్‌ హద్దు మీరి ప్రవర్తిస్తే భారత్‌ సరిహద్దు దాటడానికి వెనుకడుగు వేయదని హెచ్చరించారు. భూ, వాయు మార్గాల్లో దాడు చేసి ఆ దేశానికి బుద్ధి చెబుతామన్నారు. యుద్ధం అంటే వస్తే అణ్వాయుధాలు ప్రయోగిస్తామన్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ఆ అవసరం కూడా తమకు లేదని బిపిన్‌ రావత్‌ స్పష్టం చేశారు. పైగా, తమ బలగాలు ఎల్లవేళలా సర్వసన్నద్ధంగా ఉన్నాయని ఆయన ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments