Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా బిపిన్ రావత్?

Webdunia
శుక్రవారం, 16 ఆగస్టు 2019 (10:23 IST)
రక్షణ రంగంలో సంస్కరణలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టారు. ఇందలోభాగంగా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) పోస్టును కొత్తగా చేపట్టనున్నారు. అంటే సైన్య, వాయుసేన, నావికాదళాలన్నీ కలపి ఒకే అధిపతి కింద పని చేయనున్నాయి. నిజానికి ఈ మూడు రంగాలు ప్రస్తుతం వేటికవే ప్రత్యేకం. వాటికి విడిగా అధిపతులు ఉన్నారు. 
 
అయితే, సాయుధ దళాలన్నీ ఒకే గొడుగు కిందకు రావాల్సిన అవసరం ఉందని, అందుకే కొత్తగా సాయుధ దళాల కోసం ఉమ్మడి అధిపతి పదవిని సృష్టిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఎర్రకోటపై నుంచి చేసిన ప్రసంగంలో వెల్లడించారు. 
 
'చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్' (సీడీఎస్) పదవి ద్వారా భారత త్రివిధ దళాలు కలిసికట్టుగా ముందుకు సాగుతాయని, తద్వారా మూడు దళాల మధ్య సమన్వయం సాధ్యమవుతుందని వివరించారు. దీంతో రక్షణ రంగంలో కూడా మోడీ తనదైన ముద్ర వేయాలన్న పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. 
 
సాంకేతిక వ్యవస్థలు అభివృద్ధి చెందుతున్న వేళ సైనిక, వాయుసేన, నావికాదళాలు విడివిడిగా వ్యూహాలు రూపొందించుకోవడం ద్వారా సరైన ఫలితాలు రావని, త్రివిధ దళాలు ఉమ్మడిగా కార్యాచరణకు దిగాలంటే 'సీడీఎస్' పదవి అవసరమని తాము భావిస్తున్నామని మోడీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో తొలి సీడీఎస్‌గా ఆర్మీ చీఫ్‌గా ఉన్న బిపిన్ రావత్‌ను నియమించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments