Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో... నాకు నారా లోకేష్ ఛాంబరా? వద్దు బాబోయ్ అంటూ ఏపీ మంత్రి

Webdunia
బుధవారం, 12 జూన్ 2019 (18:39 IST)
నారా లోకేష్... ఏపీ మాజీ మంత్రి. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఘోర పరాజయం పాలయ్యారు. తండ్రి చంద్రబాబు నాయుడు మెజార్టీ కాస్తాకూస్తో తగ్గినా విజయం సాధించారు కానీ కుమారుడు లోకేష్ మాత్రం పోటీలో నిలవలేకపోయారు. ఇప్పుడు మరోసారి నారా లోకేష్ వార్తల్లోకి వచ్చారు.
 
అదెలాగో చూద్దాం. వైసీపికి చెందిన కొత్త మంత్రులు వరుసబెట్టి మంచి ముహూర్తం చూసుకుంటూ సచివాలయంలో ఆయా ఛాంబర్లలోకి వెళ్తున్నారు కదా. మొత్తం 25 మంత్రులకు అధికారులు ఆయా ఛాంబర్లను కేటాయించారు. దాంతో వారివారి ఛాంబర్లలోకి ప్రవేశిస్తున్నారు మంత్రులు. ఐతే ప్రత్యేకించి ఓ మంత్రి మాత్రం తనకు కేటాయించిన ఛాంబర్ గది 188 చూసి జడుసుకున్నారట. తనకు ఆ ఛాంబర్ వద్దు బాబోయ్ అని చెప్పారట.
 
ఇంతకీ ఆ ఛాంబర్ ఎవరిదయా అంటే... గతంలో అది మాజీ మంత్రి నారా లోకేష్ బాబుది. ఈ ఛాంబర్‌ను ప్రస్తుత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అధికారులు కేటాయించారట. విషయం తెలుసుకున్న మంత్రిగారు తనకు ఆ ఛాంబర్ వద్దుబాబోయ్ అంటూ చెప్పారట. దాంతో ఆయనకి సచివాలయంలోని 3వ బ్లాక్‌లోని 203 రూమ్‌ను ఛాంబర్‌గా కేటాయిస్తూ ఏర్పాట్లు చేశారట. అదీ సంగతి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments