Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలు - కూరగాయలు అమ్ముకుని జీవిస్తున్నామంటున్న సీఎం సన్

తనతో పాటు.. తన కుటుంబ సభ్యులు పాలు, కూరగాయలు అమ్ముకుని జీవిస్తున్నామని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు. అందువల్ల తమ ఇంట అవినీతికి ఛాన్సేలేదన్నారు.

Webdunia
శుక్రవారం, 23 మార్చి 2018 (16:56 IST)
తనతో పాటు.. తన కుటుంబ సభ్యులు పాలు, కూరగాయలు అమ్ముకుని జీవిస్తున్నామని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు. అందువల్ల తమ ఇంట అవినీతికి ఛాన్సేలేదన్నారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో తాగునీటి ట్యాంకర్లలో అవినీతి జరుగుతోందని బీజేపీ పక్షనేత సోము వీర్రాజు ఆరోపించారు. దీనిపై మంత్రి లోకేశ్‌ స్పందిస్తూ, అవినీతికి పాల్పడాల్సిన అవసరం తనకు ఏమాత్రం లేదన్నారు. 
 
అలాగే తన శాఖలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగడం లేదన్నారు. తన కుటుంబం పాలు, కూరగాయలు అమ్మి డబ్బు సంపాదిస్తోందని.. చివరికి తన క్రెడిట్‌ కార్డు బిల్లు కూడా వారే కడతారని చెప్పారు. తన శాఖలో అవినీతి జరుగుతున్నట్లు ఆధారాలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటానని మంత్రి లోకేశ్ హెచ్చరించారు. 
 
అలాగే, విశాఖపట్టణంలో ఐటీ కంపెనీలకు నింబంధనల ప్రకారమే సంస్థలకు భూములు ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ విధానాలపై ఆరోపణలు చేస్తున్న వారు ఐటీ పరిశ్రమలను తీసుకొచ్చినా... 21 రోజుల్లోనే భూములు ఇస్తామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టి బయట ఉన్న పార్టీ సభ్యులు, లోపలే ఉండి విమర్శలు చేస్తున్న సభ్యులు తెలుసుకునేందుకే తాను ఈ విషయాలను చెబుతున్నానని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments