రోజమ్మా... మీకు ఆ పదవి ఓకేనా? సీఎం జగన్ ఫోన్...

Webdunia
శుక్రవారం, 31 మే 2019 (13:57 IST)
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కేబినెట్ పైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. జగన్ కేబినెట్లో ఎవరెవరు ఉంటారన్న చర్చ తీవ్రస్థాయిలో జరుగుతోంది. పార్టీలో ఉన్న సీనియర్ నేతల మనస్సు నొప్పించకుండా అందరికీ సరిసమానంగా పదవులు కేటాయించాలని, ఎవరూ అలకపాన్పు ఎక్కకూడదన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
 
అందుకే నిన్న జగన్మోహన్ రెడ్డి సిఎంగా తానొక్కరే ప్రమాణ స్వీకారం చేసి మంత్రుల ప్రమాణ స్వీకారాన్ని వారంరోజుల పాటు వాయిదా వేశారు. అందుకు కారణం ఇంకా ఎవరిని తీసుకోవాలోనన్నది క్లారిటీ రాకపోవడమే. కేబినెట్ మంత్రులు అనగానే ప్రధానంగా వినిపించే పేరు రోజా. రోజాకు జగన్ కేబినెట్లో మంచి శాఖే వస్తుందని అందరూ చెప్పుకుంటున్నారు. ఆమెకు హోంమంత్రి పదవి ఇచ్చే అవకాశమే ఎక్కువ ఉందన్న ప్రచారంలో ఉంది.
 
ఆమెకు ఏ శాఖ కేటాయించినా ఆ శాఖను సమర్థవంతమైన మంత్రిగా పనిచేయగలదన్నది విశ్లేషకుల భావన. అందుకే రోజాను స్పీకర్ చేసేస్తే ఎలా వుంటుందన్న ఆలోచన చేస్తున్నారట జగన్ మోహన్ రెడ్డి. దీంతో నిన్న రాత్రి రోజాకు స్వయంగా జగన్ ఫోన్ చేశారట. రోజమ్మా.. మీరు స్పీక‌ర్‌గా చేస్తారా అని అడిగారట. దీంతో... రోజా... సర్ మీ ఇష్టమంటూ చెప్పారట. కానీ రోజాకు స్పీకర్‌గా ఉండటం ఏమాత్రం ఇష్టం లేదని ఆమె సన్నిహితులు అంటున్నారు. కానీ అధినేత చెప్పిన తరువాత ఇష్టం లేకపోయినా సరే చేయాలి కదా. మరి చివరి నిమిషంలో ఏమయినా జరగొచ్చు. చూద్దాం మనం కూడా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర వీణ పాటకు తమిళనాడు సీఎం విజయ్ స్టెప్పులు, వీడియో

Ghantadi Krishna: నా ఆశ నా శ్వాస సంగీతం, దర్శకత్వంతో రిస్క్ చేశా : ఘంటాడి కృష్ణ

VN Aditya: వినోదభరితంగా మన డాక్టర్ బాబే సినిమా: వీఎన్ ఆదిత్య

Kiran Abbavaram : ఛాట్ బస్టర్స్ గా దూసుకెళ్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ

Dharma Mahesh : జీ5లో ట్రెండింగ్ టాప్-1గా ధర్మ మహేష్ చిత్రం డ్రింకర్ సాయి

తర్వాతి కథనం
Show comments