దేవుడి వస్త్రం, అక్షింతలు జగన్‌కు పడవా? నెటిజన్ల ట్రోల్స్

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (12:20 IST)
Jagan
దేవుడి వస్త్రం, అక్షింతలు ఏపీ సీఎం జగన్‌కు పడవా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. శ్రీవారి అక్షింతలు, ఆయన వస్త్రం కోసం భక్తులు వేయికనులతో వేచి చూస్తుంటారు. అలాంటి దేవుడి వస్త్రం, అక్షింతలను ఏపీ సీఎం జగన్ నిర్లక్ష్యం చేశారని అంటున్నారు. 
 
తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారికి సీఎం జగన్ ఏపీ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామివారి దర్శనం అనంతరం సీఎం జగన్‌కు ఆలయ అర్చకుడు వేదాశీర్వచనం అందించారు. 
 
అలాగే మంగళవారం శ్రీవారిని జగన్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అక్షింతలు, వస్త్రం సమర్పించారు. అయితే సీఎం జగన్ అక్షింతలను వెంటనే తలపై నుంచి తొలగించారు. ఇలా జగన్ అక్షింతలను తొలగించడాన్ని ఆయనతో పాటు వచ్చిన ఎమ్మెల్యేలు చూస్తూ మిన్నకుండిపోయారు. 
 
అయితే నెటిజన్లు మాత్రం దేవుడి వస్త్రం, అక్షింతలు జగన్‌కు పడవా అంటూ ఫైర్ అవుతున్నారు. శ్రీవారిపై నమ్మకం లేని వ్యక్తి తిరుమలకు ఎందుకు వెళ్లాలి అంటూ ప్రశ్నిస్తున్నారు. వేసిన అక్షింతలు దులుపుకునే కాడికి గుడికి పోవడం దేనికి అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments