Webdunia - Bharat's app for daily news and videos

Install App

గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆరోగ్యంపై సీఎం జగన్ ఆరా

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (10:59 IST)
ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆరోగ్యంపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఆయనకు అందించిన చికిత్సపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అపెండిసైటిస్‌తో బాధపడుతున్న అబ్దుల్ నజీర్‌కు సర్జరీ చేసినట్టు వైద్యులు చెప్పారు. 
 
ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా వుందని వైద్యులు జగన్‌కు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు. 
 
ఇకపోతే.. గవర్నర్ కడుపు నొప్పితో బాధపడుతూ తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో సోమవారం  చేరారు. గవర్నర్ అస్వస్థతకు గురికావడంతో తొలుత రాజ్‌భవన్ వర్గాలు వైద్యులకు సమాచారం అందించాయి. వెంటనే విజయవాడ నుంచి వచ్చిన వైద్యులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను పరీక్షించారు. 
 
వారి సూచన మేరకు ఆయనను మణిపాల్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ఆయనకు అపెండిసైటిస్‌ కారణంగా రోబోటిక్ అసిస్టెడ్ అపెండిసిటోమీ ఆపరేషన్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓజీ.. ఓజీ అని వెళితే... ప్రజలు క్యాజీ అంటూ ప్రశ్నిస్తారు : పవన్ కళ్యాణ్

జీబ్రా చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

సీనియర్ నటుడు, వ్యాఖ్యాత ఎ.వి. రమణ మూర్తి అమర్నాధ్ యాత్రలో కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments