కార్యకర్తలను చితక్కొట్టినా గెలిపించారు... అనంత తెదేపాలో 'ఒక్క మగాడు'...

Webdunia
శుక్రవారం, 31 మే 2019 (17:09 IST)
ఎపిలో తెలుగుదేశం పార్టీ భారీ ఓటమిని చవిచూసింది. కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఆ పార్టీ నుంచి గెలుపొందారు. తన సొంత జిల్లా చిత్తూరులో చంద్రబాబునాయుడు కేవలం ఒకే ఒక్క సీటులో గెలుపొందారు. అది కూడా ఆయన సీటే. మొదట్లో చంద్రబాబునాయుడు రెండు రౌండ్లలో వెనుకబడిపోయారు. వైసిపి అభ్యర్థి చంద్రమౌళి రెండు రౌండ్లలోనే ముందజంలో ఉన్నారు.
 
దీంతో ఒక్కసారిగా చంద్రబాబు ఓడిపోతారన్న ప్రచారం బాగా సాగింది. కానీ ఆ తరువాత చంద్రబాబు నాయుడు పుంజుకుని గెలుపొందారు. గతంతో పోలిస్తే మెజారిటీ కాస్త తక్కువే. అయితే అనంతపురం జిల్లాలో బాలక్రిష్ణ గెలుస్తాడా లేదా అన్న ప్రచారం పెద్దగానే సాగింది. బాలక్రిష్ణ ఓడిపోతారని బెట్టింగ్‌లు బాగానే కట్టారు. కానీ బాలక్రిష్ణ మాత్రం హిందూపురంలో గెలిచారు. అనంతపురంలో చెప్పుకోదగ్గ టిడిపి నాయకుడు బాలక్రిష్ణ ఒక్కరే. చేతికందిన కార్యకర్తలను అప్పుడప్పుడూ చితక్కొట్టినా అదంతా ప్రేమతో కొట్టిన చితక్కొట్టుడే అని ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. అందుకే అనంత తెదేపాలో ఒక్క మగాడంటూ జిల్లాలో ప్రచారం జోరుగా సాగుతోంది.
 
వైసిపి అభ్యర్థిని దీటుగా ఎదుర్కొన్నారు బాలక్రష్ణ. అభివృద్ధిలో హిందూపురంను ముందుకు సాగించారు. అందుకే ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారన్నారు. దీంతో బాలక్రిష్ణ కూడా హిందూపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నాపై నమ్మకం ఉంచారు. నేను హిందూపురంను మరింత అభివృద్థి చేస్తానంటూ హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

ఘంటసాల స్క్రిప్ట్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది : ఆదిత్య హాసన్

సంగీత్ శోభన్ హీరోగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments