Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నిర్బంధంలో మనిషి : పక్షులు - జంతువులకు సంపూర్ణ స్వేచ్ఛ

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (21:11 IST)
ప్రకృతిని మనిషి బంధించాడనే విషయం ఇపుడు తేటతెల్లమైంది. ఒక మనిషిని స్వీయ నిర్బంధంలో ఉంచితే ప్రకృతిలోని అనేక జంతువులు, పక్షులు, వన్యప్రాణాలు, మృగాలకు ఎంత స్వేచ్ఛ వస్తుందో ఈ కరోనా నిరూపించింది. కరోనా వైరస్ దెబ్బకు దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంది. దీంతో జనసంచారం పూర్తిగా తగ్గిపోయింది. పైగా, మనిషి సృష్టించిన సాంకేతకత సంచారం కూడా తగ్గిపోయింది. ఇదే పక్షులు జంతువులు ఇప్పుడు స్వేచ్చగా సంచరించేలా చేస్తున్నాయి. తాజాగా ముంబైలో వలస పక్షులు ఫ్లెమింగోలు పండుగ చేసుకుంటున్నాయి.
 
ముంబైలోని అరేబియా సముద్రతీరం వెంబడి ఉండే చిత్తడి ప్రదేశాలకు ప్రతి ఏటా వేలసంఖ్యలో ఫ్లెమింగోలు వస్తుంటాయి. ఈసారి వాహనాలుగానీ, మనుషుల సంచారంగానీ లేకపోవటంతో లక్షల సంఖ్యలో వచ్చిన ఫ్లెమింగోలు సందడి చేస్తున్నాయి. గతేడాదికంటే ఈ సంవత్సరం 25 శాతం ఎక్కువ ఫ్లెమింగోలు వలసవచ్చాయని బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ డైరెక్టర్‌ దీపక్‌ ఆప్టే వెల్లడించారు.
 
ముంబై చుట్టుపక్కల ప్రస్తుతం లక్షన్నరదాకా ఫ్లెమింగోలు సందడి చేస్తున్నాయని ఆయన తెలిపారు. ఇవి గుజరాత్‌లో ఖచ్‌ నుంచి, రాజస్థాన్‌లోని సాంబార్‌ సరస్సుతోపాటు పాకిస్థాన్‌, ఆప్ఘనిస్థాన్, ఇజ్రాయేల్‌ దేశాల నుంచి కూడా వలస వస్తాయని గుర్తుచేశారు. ఈ ఫ్లెమింగోల ఫోటోలను బాంబే నాచురల్‌ హిస్టరీ సొసైటీ ట్విటర్‌లో పోస్టు చేయటంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ తెగలైకులు కొడుతున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments