Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతుల హింసాత్మక ర్యాలీ: నిరసనల నుండి విఎం సింగ్ మద్దతు ఉపసంహరణ

Webdunia
బుధవారం, 27 జనవరి 2021 (17:26 IST)
గణతంత్ర వేడుకలు రోజు దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ర్యాలీలో రైతులు పోలీసులను కర్రలతో చితక బాదారు. దీనితో వందలమంది గాయపడ్డారు. ఈ నేపధ్యంలో 3 కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల నిరసనల నుండి రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ మరియు రైతు నాయకుడు సర్దార్ వి.ఎం సింగ్ మద్దతు ఉపసంహరించుకున్నారు.
 
నిరసనలో పాల్గొన్న మరో యూనియన్ కిసాన్ యూనియన్ కూడా బుధవారం తమ మద్దతును ఉపసంహరించుకుంది. ఆందోళనలో పాల్గొంటున్న రైతులు చిల్లా సరిహద్దు నుండి వైదొలగాలని ప్రకటించింది. రైతు నాయకుడు సర్దార్ వి.ఎం. సింగ్ మాట్లాడుతూ, "ఎవరో నిర్ణయించే దిశలో మేము నిరసనను సాగించలేము. నేను వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఐతే నేను, రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంగథన్ నిరసన నుండి వైదొలగుతున్నాం. మేము ప్రజలను, అమరవీరులను కొట్టేందుకు ఢిల్లీ ఎర్రకోట వైపుకి రాలేదు" అని అన్నారు.
 
దీనితో భవిష్యత్తులో రైతుల నిరసన కార్యక్రమం బలహీనపడే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఫిబ్రవరి 1న పార్లమెంటుకి పాదయాత్ర ఏమేరకు నిర్వహించగలరోనన్న అనుమానం కూడా కలుగుతోంది.
 

సంబంధిత వార్తలు

ధనుష్, సందీప్ కిషన్ సన్ ల రాయన్ థియేట్రికల్ రిలీజ్ డేట్ ఫిక్స్

కర్నాటక, హైదరాబాదు లో ప్రతి లొకేషన్ కి నెమలి వచ్చేది: హరోం హర డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారక

తుఫాను హెచ్చరిక టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల

యేవ‌మ్ టీమ్‌ను చూస్తుంటే ముచ్చ‌ట‌గా వుంది: మాస్ కా దాస్ విశ్వ‌క్‌సేన్

పుష్ప‌-2 ప్రోడక్ట్ పనుల్లో సుకుమార్ తో టెక్నీషియన్ విభేదాలు?

అంజీర పండు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

బ్రెయిన్ ట్యూమర్ సర్వైవర్స్‌తో అవగాహన వాకథాన్‌ని నిర్వహించిన కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలిపే 9 కారణాలు

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2024: గర్భిణీ తల్లులకు సురక్షితమైన ఆహార చిట్కాలు

చెరకు రసంతో ప్రయోజనాలు సరే.. అలాంటి వారికి ఇక్కట్లే..

తర్వాతి కథనం
Show comments