కోవిడ్ 19 క్లినికల్ ట్రైల్స్‌లో టీకా తీసుకున్న వ్యక్తి మృతి, కారణం?

Webdunia
శనివారం, 9 జనవరి 2021 (19:41 IST)
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన 42 ఏళ్ల కోవిడ్ వాలంటీర్ మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇతడు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగిన కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్‌లో పాల్గొన్నాడు. ఈ ట్రైల్ వ్యాక్సిన్ తీసుకుని దాదాపు పది రోజుల తరువాత మరణించాడు. దీనితో టీకాపై ఆందోళనలు నెలకొన్నాయి. 2020 డిసెంబర్ 12న జరిగిన కోవాక్సిన్ ట్రైల్స్‌లో దీపక్ మరావి అనే వాలంటీర్ పాల్గొన్నట్లు విచారణ జరిపిన పీపుల్స్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రాజేష్ కపూర్ తెలిపారు.
 
మధ్యప్రదేశ్ మెడికో లీగల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ శర్మ మాట్లాడుతూ, మరణించిన వ్యక్తి పోస్టుమార్టం రిపోర్టులో అతడు విషం కారణంగా మరణించాడని అనుమానిస్తున్నారు. ఐతే ఖచ్చితమైన సమాచారం ఇంకా రాలేదు.
 
డాక్టర్ కపూర్ మాట్లాడుతూ... మృతిచెందిన మరావికి టీకా షాట్ ఇవ్వబడిందా లేదంటే ప్లేసిబో ఇవ్వబడిందా అని ధృవీకరించలేమని చెప్పారు. "ఇది (ట్రయల్ కోసం ద్రవాన్ని కలిగి ఉన్న సీసా) బయటకు వచ్చి కోడ్ చేయబడింది. ట్రైల్ సమయంలో, 50 శాతం మందికి అసలు ఇంజెక్షన్ లభిస్తుంది, మిగిలిన వారికి సెలైన్ ఇస్తారు" అని ఆయన చెప్పారు. కాగా ఈ విషయంపై మధ్యప్రదేశ్ ఆరోగ్య మంత్రి డాక్టర్ ప్రభురామ్ చౌదరి ఫోన్ కాల్స్ పట్ల స్పందించలేదు.
 
కాగా డిసెంబర్ 12న మరావి, అతని సహోద్యోగికి కోవాక్సిన్ ఇంజెక్షన్ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. "అతను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అసౌకర్యానికి గురయ్యాడు. కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాడు. అతను డిసెంబర్ 17న భుజం నొప్పితో బాధపడ్డాడు. రెండు రోజుల తరువాత, అతను నోట్లో నురుగు కక్కాడు. అతను ఒకటి లేదా రెండు రోజుల్లో బాగానే ఉంటానని చెప్పి వైద్యుడిని చూడటానికి నిరాకరించాడు. ఆ తర్వాత అతడి పరిస్థితి క్షీణించింది. ఆ తర్వాత అతడిని ఆసుపత్రికి తరలించారు. కాని అతను మార్గమధ్యంలోనే (డిసెంబర్ 21 న) మరణించాడు" అని వారు తెలిపారు. అయితే, ఈ ఆరోపణను ఆసుపత్రి ఖండించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments