Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ఇంజిన్ కింద కూర్చుని 200 కి.మీ ప్రయాణం, చూసినవారంతా షాక్, తేరుకునేలోపే పరార్

Webdunia
మంగళవారం, 7 జూన్ 2022 (16:37 IST)
రైలు పట్టాలపై రైలు ఇంజిన్ వస్తుందంటేనే అంతదూరం పరుగుపెడతారు. అలాంటిది రైలు ఇంజిన్ కింద భాగంలో కూర్చుని ఓ యువకుడు ఏకంగా 200 కి.మీ ప్రయాణం చేసాడు. ఈ షాకింగ్ ఘటన పూర్తి వివరాలు ఇలా వున్నాయి.


పాట్నా మీదుగా రాజ్‌గిర్ నుంచి వస్తున్న బుద్ధ పూర్ణిమ ఎక్స్‌ప్రెస్ మరికొద్దిసేపట్లో గయా జంక్షన్ వద్ద ఆగబోతోంది. ఇంతలో రైలు ఇంజిన్ నుంచి నుంచి పెద్దపెద్ద ఏడుపులు, కేకలు వినిపించాయి. అవి ఎటు నుంచి వస్తున్నాయో అర్థంకాలేదు.

 
ఇంతలో రైలు గయా స్టేషను వద్దకు చేరుకోగానే... డ్రైవర్ రైలు దిగి అటుఇటూ చూసాడు. ఐతే రైలు ఇంజిన్ కింద నుంచి ఏడుపులు, మంచినీళ్లు కావాలంటూ కేకలు వినిపించాయి. రైలు కింద చూస్తే ఓ వ్యక్తి కనిపించాడు. అతడిని చూసి అక్కడున్నవారంతా షాక్ తిన్నారు. మెల్లగా అతడిని రైలు ఇంజిన్ కింద నుంచి బయటకు లాగారు. రైలు డ్రైవర్ స్థానిక పోలీసు అధికారులకు విషయాన్ని చెప్పాడు.

 
ఐతే వారు వచ్చేలోపుగానే ఇతడు పరారయ్యాడు. అతడి కోసం గాలిస్తున్నారు. ఐతే రైలు ఇంజిన్ కింది భాగం విపరీతమైన వేడితో పాటు, వేగానికి కింద జారిపడిపోయే అవకాశం కూడా వుంది. అలాంటిది సుమారు 200 కిలోమీటర్ల ప్రయాణాన్ని అతడు ఎలా చేసాడా అని అంతా ఆశ్చర్యపోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments