నవంబరులో వివాహం జరగాల్సింది.. ఇంతలోనే రైల్వే ట్రాక్‌పై ప్రాణాలు కోల్పోయాడు.. (video)

సెల్వి
మంగళవారం, 14 అక్టోబరు 2025 (10:29 IST)
Bike
సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతూ వుంటాయి. ఆదివారం గ్రేటర్ నోయిడాకు చెందిన తుషార్ అనే యువకుడు బైక్‌పై.. దాద్రి రైల్వే ట్రాక్‌ వద్దకు వచ్చాడు. అయితే రైలు రావడానికి ఇంకా కొంత సమయం ఉండడంతో బైక్‌పైనే ట్రాక్‌ను దాటడానికి  ప్రయత్నించాడు. 
 
అయితే అదే సమయంలో అనుకోకుండా బైక్‌ అదుపు తప్పింది. దీంతో బైక్‌తో పాటు రైలు పట్టాలపై పడిపోయాడు. వెంటనే తేరుకొని బైక్‌ను తీసుకోవడానికి ప్రయత్నిస్తుండగానే.. రైలు దగ్గరకు వచ్చింది. దాన్ని గ్రహించి పక్కకు పరిగెత్తడానికి ప్రయత్నించాడు. కానీ అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. 
 
అప్పటికే సమీపానికి వచ్చిన రైలు తుషార్‌ను ఢీకొట్టడంతో తుషార్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ట్రాక్‌ దగ్గర ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
 
మృతుడిని దాద్రిలోని దత్తావాలి గ్రామానికి చెందిన తుషార్ (19) గా గుర్తించారు. అతను ఇటీవలే 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. ఇంకా ఏ కళాశాలలోనూ అడ్మిషన్ తీసుకోలేదు. తుషార్ వివాహం నవంబర్ 22న జరగాల్సి ఉందని, ఇంట్లో సన్నాహాలు జరుగుతున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఈ విషాదంతో కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kamalhasan: కమల్ హాసన్ చిత్రం సెయాన్ లో శివకార్తికేయన్ ఫస్ట్ లుక్

ధర్మస్థల నియోజకవర్గం లో డ్యాన్సర్ శ్రష్టి వర్మ సింగిల్

Nagabandham teaser: పాన్ ఇండియా టాప్ ట్రెండింగ్‌లో నాగబంధం టీజర్

Sunil: కాటాలన్ ఐటెం నంబర్‌లో అదరగొట్టిన సునీల్

త్రిషపై బీజేపీ నేత ఫైర్- అలాంటి వ్యాఖ్యలు అసహ్యకరమైనవి... లాయర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments