Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహం జరిగి 14 రోజులైంది... పెళ్లి చేసిన అర్చకుడితో కొత్త పెళ్లికూతురు జంప్..

Webdunia
శుక్రవారం, 31 మే 2019 (13:20 IST)
వివాహం జరిగి 14 రోజులైంది. అంతే పెళ్లి చేసిపెట్టిన అర్చకుడితో కొత్తపెళ్లి కూతురు పరారైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్, అజాద్ అనే గ్రామంలో గత ఏడో తేదీన ఓ జంటకు వివాహం జరిగింది. ఈ వివాహానికి ఆ ప్రాంతానికి చెందిన ఓ ఆలయ అర్చకుడు వినోద్ మహారాజ్ పండితుడిగా హాజరై.. పెళ్ళితంతును పూర్తి చేశాడు. 
 
అయితే వివాహం జరిగిన 16వ రోజున వున్నట్టుండి కొత్త పెళ్లి కూతురు అదృశ్యమైంది. కొత్త పెళ్లి కూతురు కనబడట్లేదని ఆ ఊరంతా తెలిసిపోయింది. అదే సమయంలో ఆ ఊరి ఆలయ అర్చకుడు కూడా మాయమయ్యాడు. ఇకపోతే.. కొత్త పెళ్లి కూతురు వెళ్తూ వెళ్తూ ఒకటిన్నర లక్ష రూపాయల విలువగల బంగారం, 30వేల రూపాయల నగదు తీసుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. 
 
ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు.. అర్చకుడితో కొత్త పెళ్లికూతురికి పెళ్లికి ముందు నుంచే తెలుసునని.. పెళ్లికి ముందే అతనితో చెట్టాపట్టాలేసుకుని ఆమె తిరిగేదని తెలిసింది. ఇక అర్చకుడికి ఇప్పటికే వివాహం జరిగిందని, ఇద్దరు సంతానం కూడా వున్నారని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments