Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నేను విన్నాను.. నేనున్నాను'.. భరోసానిచ్చే "యాత్ర" టీజర్ అదిరింది

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (10:11 IST)
దివంగత వైఎస్. రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "యాత్ర". మహి వి. రాఘవ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో అంటే వైఎస్ఆర్‌గా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి పోషిస్తున్నారు. 
 
పాదయాత్ర సమయంలో రైతుల సమస్యలను తెలుసుకొని వాటిని ఎలా పరిష్కరించాడు అన్నది ఈ సినిమా కథ. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం విడుదల చేశారు. 
 
ఈ టీజర్‌లో రైతులు పడుతున్న కష్టాలను కళ్లకు కట్టేలా చూపించారు. "పంటపండించే రైతుకు సరైన సమయానికి వర్షాలు పడవు.. కరెంట్ ఉండదు.. అన్ని ఉంటె గిట్టుబాటు ధర ఉండదు అనే రైతే రాజు అంటారు.. రాజుగా కాదు కనీసం రైతును రైతుగా గుర్తిస్తే చాలు" అనే డైలాగ్స్  టీజర్ సాగుతుంది. 
 
దీనికి ప్రతిగా "నేను విన్నాను.. నేనున్నాను" అనే డైలాగ్‌తో టీజర్ ఎండ్ అవుతుంది. రైతు చుట్టూనే ఈ సినిమా నడుస్తుందని ఇట్టే తెలిసిపోతుంది. మహి రాఘవ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 8వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. టీజర్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయని చెప్పొచ్చు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments