Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మెగా కాంపౌండ్‌లోకి రష్మిక మందన్నా ఎంట్రీ

మెగా కాంపౌండ్‌లోకి రష్మిక మందన్నా ఎంట్రీ
, గురువారం, 20 డిశెంబరు 2018 (10:35 IST)
మెగా కాంపౌండ్‌లోకి కన్నడ భామ, 'గీతగోవిందం' హీరోయిన్ రష్మిక మందన్నా ప్రవేశించనుంది. మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ - హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. కోలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన "జిగర్తాండ" చిత్రాన్ని వరుణ్ తేజ్ హీరోగా రీమేక్ చేయనున్నారు. 
 
ఇందులో రష్మిక మందన్నాను హీరోయిన్‌గా ఖరారు చేసినట్టు సమాచారం. 'గీతగోవిందం' చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన రష్మిక.. ఆ తర్వాత 'దేవదాస్' చిత్రంలో ప్రేక్షకులకు కనిపించింది. కానీ, ఈ చిత్రం ఆమెను పూర్తిగా నిరాశపరిచింది. ఇపుడు విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తోంది. 
 
ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ సరసన నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డియర్ కామ్రేడ్ షూటింగ్ ముగిన తర్వాత వరుణ్ తేజ్‌తో రష్మిక మందన్నా జతకట్టనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓ చేతిలో టీ, మరో చేతిలో సమోసాలు... ఉపాసనపై ఆ ప్రభావం బాగా పడినట్లుంది...