రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డీవీ
శనివారం, 15 జూన్ 2024 (19:24 IST)
Prabhutva Junior Kalasala trailer
ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా నటిస్తున్న సినిమా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′. ఈ చిత్రాన్ని ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. బ్లాక్ ఆంట్ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాతగా వ్యవహరించారు. ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది.

సెన్సార్ నుంచి యూ.ఏ సర్టిఫికేట్ అందుకున్న  ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ సినిమా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.

ఇటీవల విడుదల చేసిన ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ట్రైలర్ బాగుందంటూ సినీ ప్రియులు, నెటిజన్స్ నుంచి కామెంట్స్ దక్కుతున్నాయి. ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ పట్ల మేకర్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
 
ఈ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే.. టీనేజ్ లో అడుగుపెట్టిన వాసు (ప్రణవ్ ప్రీతం) స్నేహితులతో కలిసి సరదాగా తిరుగుతుంటాడు. కాలేజ్ లో అడుగుపెట్టగానే అందమైన అమ్మాయి కుమారి (షాజ్ఞ శ్రీ వేణున్)ని చూసి పడిపోతాడు. కుమారిని చూస్తేనే భయంతో వాసుకు మాటలు రావు. వాసు, కుమారి స్నేహం కొన్నాళ్లకు ప్రేమగా మారుతుంది. ఒకరినొకరు చూసుకోకుండా ఒక్కరోజు కూడా ఉండలేనంతగా దగ్గరవుతారు. కుమారి గురించి కాలేజ్ లో ఎవరైనా తప్పుగా మాట్లాడితే వాసు వాడికి బుద్ధి చెబుతుంటాడు. ఇంతగా ప్రేమించిన వాసుతో మాట్లాడటం ఆపేస్తుంది కుమారి. వాసు ఎంత ప్రయత్నించినా కుమారి మనసు మారదు. వాసుకు కుమారి ఎందుకు దూరంగా ఉండాలనుకుంది ?. ఈ జంట తిరిగి ప్రేమలో ఒక్కటయ్యారా ? లేదా ? అనే అంశాలతో ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ ట్రైలర్ ఆసక్తికరంగా ముగిసింది. ఈ ట్రైలర్ లో 'తనువు నాది కానీ, మనసు నీది కాదా..నిను చూడలేకుండా ఉండదే..నిదురనైన నిన్ను మరువదే.. ' పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందమైన పల్లెటూరి విజువల్స్, ‌ఫీల్ గుడ్ లవ్ ఎలిమెంట్స్, ఎమోషన్, మ్యూజిక్ వంటి అంశాలన్నీ ట్రైలర్ లో ఆకట్టుకున్నాయి. 
 
ట్రైలర్ కు వస్తున్న మంచి రెస్పాన్స్ ఈ నెల 21న రిలీజవుతున్న ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ సినిమాకు కూడా దక్కుతుందని మూవీ టీమ్ ఆశిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేటీఆర్ పర్యటన... ఛాతినొప్పితో కెమెరామెన్ దామోదర్ మృతి.. అందరూ షాక్

సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం

Jagan: మూడు రాజధానుల విషయంపై నోరెత్తని జగన్.. అదో పెద్ద స్కామ్ అంటూ..?

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

కొత్త సంవత్సర వేడుకలు.. సైబరాబాద్ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments