Webdunia - Bharat's app for daily news and videos

Install App

తగ్గేదేలే అంటూ ప్ర‌యోగాలు చేసిన బ‌న్నీ ''పుష్ప'

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (11:15 IST)
పుష్పరాజ్..  నీ అవ్వా తగ్గేదేలే ...అంటూ థియేటర్లలోకి వచ్చిన బన్నీ.. ఈ సినిమాతో చాలా ప్రయోగాలే చేశారు. యూత్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప'.. ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. 
 
 
ఈ సినిమాలో అన్నింటికంటే మొదటి చెప్పుకోవాల్సిన విషయం అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్​. వీరిద్దరూ గతంలో 'ఆర్య', 'ఆర్య 2' సినిమాలు చేశారు. అవి రెండూ ప్రేమకథలే. ఇప్పుడు తీసిన హ్యాట్రిక్ మూవీ 'పుష్ప' మాత్రం అడవి బ్యాక్​డ్రాప్​లో తీసిన మాస్ ఎంటర్​టైనర్​. దీనిని కూడా రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండటం విశేషం.
 
 
అన్ని సినిమాల్లో స్టైలిష్​గా, హ్యాండ్సమ్​గా కనిపించిన బన్నీ 'పుష్ప'తో సాహసం చేశారు. లారీ డ్రైవర్​, డాన్​గా కెరీర్​లో ఎప్పుడూ చేయని పాత్రల్లో తొలిసారి కనిపించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ భుజం పైకెత్తి సరికొత్త మేనరిజమ్​తో కనిపించనున్నారు. తొలుత అందరూ దానిని పాత్రకు ఉన్న సమస్య అని అనుకున్నారు. కానీ తర్వాత బన్నీనే ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు.
 
 
రంగస్థలం సినిమాతో తొలిసారి విలేజ్​ బ్యాక్​డ్రాప్​ కథ చేసిన డైరెక్టర్ సుకుమార్ బ్లాక్​బస్టర్​ హిట్​ కొట్టారు. తద్వారా తన బలం తెలుసుకున్న సుకుమార్ దాదాపు అలాంటి నేపథ్యంతోనే 'పుష్ప' తెరకెక్కించడం విశేషం. ఇక‌, ఇప్పటి వరకూ ఎన్నో సినిమాల్లో హీరోయిన్​గా మాత్రమే చేసిన సమంత, త‌న కెరీర్​లో తొలిసారి 'పుష్ప' కోసం స్పెషల్ సాంగ్ చేసింది. యూట్యూబ్​లో, సోషల్ మీడియాలో ఈ పాట సంద‌డి చేస్తోంది. 'ఊ అంటవా ఊహు అంటవా' అనే లిరిక్స్​తో పాట చాలా ఫేమస్​ అయింది.
 
 
ఈ సినిమా మొత్తం చిత్తూరు చంద్రగిరి నేపథ్యంగా సాగనున్నట్లు తెలుస్తోంది. దీంతో నటీనటులు అందరూ చిత్రం ప్రారంభం కావడానికి ముందే ఆ యాసను నెలల పాటు ప్రాక్టీసు చేసి మరీ షూటింగ్​కు హాజరయ్యారు. మలయాళ విలక్షణ నటుడు ఫహాద్​ ఫాజిల్​ చేస్తున్న తొలి తెలుగు సినిమా ఇది. ఇందులో భన్వర్ సింగ్ షెకావత్​ అనే పోలీస్​ అధికారిగా ఆయన కనిపించనున్నారు. 'పుష్ప' తొలి భాగం ఆయన కొద్ది నిమిషాలే కనిపిస్తారని, రెండో భాగంలో మాత్రం పూర్తి నిడివి ఉన్న పాత్రలో అలరిస్తారని తెలుస్తోంది.
 
 
అల్లు అర్జున్​ గత చిత్రాలు చాలావరకు ఉత్తరాదిలో డబ్ అయ్యాయి. యూట్యూబ్​లో అవి ఒక్కొక్కటి వందల మిలియన్స్ వ్యూస్ సాధిస్తూ బన్నీకి ఎక్కడలేని క్రేజ్​ తీసుకొచ్చాయి. మరి ఇప్పుడు 'పుష్ప' లాంటి పాన్ ఇండియా సినిమాతో తొలిసారి అల్లు అర్జున్ అక్కడి ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. శేషాచలం ఎర్ర చందనం, దాని స్మగ్లింగ్​ నేపథ్యంతో వస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చైన్ స్నాచింగ్ అలా నేర్చుకున్న వ్యక్తి అరెస్ట్- రూ.20లక్షల విలువైన బంగారం స్వాధీనం

మహిళా కౌన్సిలర్ కాళ్ల మీద పడ్డాడు... నడుముపై అసభ్యంగా చేయి వేశాడే? (video)

Pawan kalyan: సెప్టెంబర్ 5న అరకులో పర్యటించనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్

Amaravati: అమరావతి అత్యంత సురక్షితమైన రాజధాని- మంత్రి నారాయణ

గతుకుల రోడ్డుకి ఎంత ఫైన్ కడతారు?: ద్విచక్ర వాహనదారుడు డిమాండ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

తర్వాతి కథనం
Show comments