Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హ‌ర్షి చిత్రం ర‌న్ టైమ్ ఎంత‌..? అల్లరి నరేష్ సుడిగాడేనా?

Webdunia
మంగళవారం, 7 మే 2019 (13:29 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన‌ భారీ చిత్రం మ‌హ‌ర్షి. అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. అల్ల‌రి న‌రేష్ కీల‌క పాత్ర పోషించిన ఈ సినిమా మే 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇందులో మ‌హేష్ స్టూడెంట్‌గా, బిజినెస్ మేన్‌గా, రైతుగా త్రీ షేడ్స్‌లో క‌నిపించ‌నున్నారు. 
 
ఇది మ‌హేష్ బాబుకి 25వ చిత్రం కావ‌డంతో అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూస్తామా అని ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఎలాంటి కట్స్‌ లేకుండా ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. 
 
ఈ మూవీ రన్ టైమ్ విష‌యానికి వ‌స్తే... 5 నిమిషాల తక్కువ మూడు గంటల నిడివి(175నిమిషాలు) అని స‌మాచారం. ఈ లెంగ్తీ రన్ టైమ్ సినిమాకు ప్ల‌స్ అవుతుందా..? మైన‌స్ అవుతుందా..? అని ఫ్యాన్న్ టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట. కానీ.. నిర్మాత మాత్రం నిడివి అనేది స‌మ‌స్యే కాదు. ఈ సినిమా ఖ‌చ్చితంగా పెద్ద విజ‌యం సాధిస్తుంది అని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మహేష్ బాబుకి మే నెల సెంటిమెంటు వున్నా అల్లరి నరేష్ సుడిగాడు ఇందులో వున్నాడు కాబట్టి భారీ హిట్ ఖాయం అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments