Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు-తెలుగు విద్యార్థులకు చేయూతినివ్వండి

Webdunia
శుక్రవారం, 27 డిశెంబరు 2019 (18:05 IST)
కృష్ణాజిల్లా విజయవాడ పి.బి సిద్ధార్థ కళాశాలలో డిసెంబర్ 27,28,29వ తేదీల్లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు జిల్లాకు సంబంధించిన 67 మంది కవులు, రచయితలకు ఆహ్వాన పత్రికలు పంపిన సమాచారాన్ని ప్రపంచ తెలుగు రచయితల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గుత్తి కొండ సుబ్బారావు, డా.జి.వి.పూర్ణచందులు తెలిపినట్లు "కళామిత్ర మండలి తెలుగు లోగిలి" జాతీయ సంస్థ అధ్యక్షులు డా.నూనె అంకమ్మరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. 
 
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం విజయవాడలో జరుగుతున్న"ప్రపంచ తెలుగు రచయితల మహాసభల"లో భాగంగా సురవరం ప్రతాపరెడ్డి వేదికపై కళామిత్ర మండలి తెలుగు లోగిలి జాతీయ అధ్యక్షులు డా.నూనె అంకమ్మరావు ప్రసంగిస్తూ నేటి ప్రపంచీకరణ నేపథ్యంలో మాతృభాషల ఔన్నత్యాన్ని చాటే విధంగా భాషలను సరళీకృతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 
 
తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు చేయూత నందిస్తూ తగిన ప్రోత్సాహకాలను ఏర్పాటు చేయాలని, నవతరానికి ఉపయోగపడే పాఠ్యాంశాల రూపకల్పన జరగాలని, గ్రంథాలయ వ్యవస్థను పరిపుష్టం చేయడానికి సన్నాహాలు చేపట్టాలని, నైతిక విలువలను తెలిపే విషయాలను బోధించాలని కోరారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments