Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొలం పనుల్లో బిజీ బీజీగా వున్న కేజీఎఫ్ స్టార్..

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (18:26 IST)
Yash
కేజీఎఫ్ స్టార్ యష్ పొలం పనుల్లో బిజీ బీజీగా వున్నాడు. తన సొంతూరు హసన్‌‌లో ఈ మధ్యనే యష్‌ వంద ఎకరాలు కొనుగోలు చేశాడని వీటి విలువ రూ.80 కోట్ల వరకు ఉంటుందని వార్తలు వచ్చాయి. 
 
ఈ మధ్యనే ఈ పొలం విషయంలో హీరో కుటుంబానికి, గ్రామస్తులకు మధ్య గొడవలు జరిగి విషయం జిల్లా కలెక్టర్‌ వరకు వెళ్లింది. సరే ఇప్పడా విషయాలను పక్కన పెడితే.. ఈ స్టార్‌ హీరో పొలంలో ఏం పండిస్తాడో చూద్దామంటే అక్కడక్కడ కొన్నిచెట్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం పనులు జరుగుతున్నట్లు ఫోటోల్లో చూస్తే తెలిసిపోతోంది.
 
ఎంత ఎదిగినా ఎక్కడి నుంచి వచ్చామన్నది మరవకూడదు. ఆ మాటని మా హీరో తూచా తప్పకుండా పాటిస్తాడని చెప్పడానికి ఈ ఫోటోలే నిదర్శనమంటూ అభిమానులు వీటిని షేర్‌ చేసుకుంటున్నారు. ఇకపోతే.. కెజిఎఫ్‌-2 రిలీజ్‌‌కి రెడీగా ఉంది.
 
ప్రశాంత్‌ నీల్‌ డైరక్షన్‌‌లో తెరకెక్కిన ఈ సినిమా జూలై 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తర్వాత యష్‌ ఏ దర్శకుడితో చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు కన్నడ దర్శకుడు నర్తన్‌తో సినిమాకి హీరో యష్ కమిట్‌ అయ్యాడని వార్తలు వచ్చినా ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చెన్నై మెరీనా బీచ్ ఎయిర్‌షోలో విషాదం.. తొక్కిసలాట.. నలుగురి మృతి

రెస్టారెంట్‌లో వెయిటర్ జాబ్ కోసం క్యూ కట్టిన భారతీయ విద్యార్థులు.. ఎక్కడ?

ఇంట్లో చోరీ చేయడానికి వచ్చి.. ఇంటిని శుభ్రం చేసిన వింత దొంగ!

రూ.3 లక్షల అప్పు చెల్లించడంలో వివాదం.. బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ!

డ్రోన్ల ద్వారా అత్యవసర మందుల చేరవేత : ఏపీ సర్కారు సన్నాహాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments