Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు సినీ కథా రచయిత అనుమానాస్పద మృతి

Webdunia
ఆదివారం, 18 జూన్ 2023 (11:57 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సినీ కథా రచయిత కీర్తీ సాగర్ (50) అనుమానాస్పదంగా మృతి చెందారు. వందలాది సినిమా కథలను రాసిన ఆయనకు గత కొంతకాలంగా ఒక్కటంటే ఒక్క సినీ కథ రాసే అవకాశం రాకపోవడంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యారు. దీంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. అదేసమయంలో ఈ విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం.
 
కర్నూలు జిల్లాకు చెందిన కీర్తి సాగర్ చాలా కాలం క్రితమే హైదరాబాద్ నగరానికి వచ్చి తన స్నేహితులతో కలిసి షేక్‌పేట పరిధిలో ఉంటున్నారు. అనేక చిత్రాలకు ఎన్నో కథలు రాసిన ఆయనకు గత కొంతకాలంగా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. అవకాశాల కోసం శతవిధాలా ప్రయత్నించారు. కానీ, ఒక్క అవకాశం కూడా రాలేదు. ఈ క్రమంలో ఆయన తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. 
 
ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున టెర్రస్‌పై విగతజీవిగా కనిపించాడు. ఉదయాన్నే లేచిన స్నేహితుడు కీర్తి సాగర్ చనిపోయివుండటాన్ని చూసి స్థానిక పోలీసులకు సమాచారం చేరవేశాడు. దీంతో పోలీసులు అక్కడకు వచ్చి సాగర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో చైన్ స్నాచింగ్‌ల్లా మొబైల్ స్నాచింగ్‌- నలుగురి అరెస్ట్

బాబూ గారూ రండి.. మాట్లాడుకుందాం... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

భోలే బాబా ఎవరు... సామాజిక మాధ్యమాలకు దూరంగా వుంటారట!

హత్రాస్ తొక్కిసలాట.. 116కి చేరిన మృతుల సంఖ్య.. ఒకేసారి అందరూ..?

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి.. లేకుంటే ఆ పని చేయండి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments