Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మాతను మోసం చేసిన హీరో పవన్ కళ్యాణ్ హీరోయిన్

Webdunia
ఆదివారం, 18 జూన్ 2023 (09:36 IST)
ఓ నిర్మాతను హీరో పవన్ కళ్యాణ్ హీరోయిన్ మోసం చేసింది. 'బద్రి' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన అమీషా పటేల్ ఈ మోసానికి పాల్పడ్డారు. దీంతో ఆమె కోర్టులో లొంగిపోయారు. ఆమె జార్ఖండ్ రాష్ట్రంలోని ఓ కోర్టులో లొంగిపోయారు. సినిమా ప్రొడక్షన్ పేరిట అమీషా పటేల్ తన నుంచి రూ.2.50 కోట్లను అప్పుగా తీసుకుని, తన డబ్బు ఎగ్గొట్టారంటూ నిర్మాత, వ్యాపారవేత్త అయిన అజయ్ కుమార్ రాంచీ కోర్టును ఆశ్రయించారు. 
 
పైగా, తన వద్ద తీసుకున్న డబ్బులతో సినిమాను పూర్తి చేయకపోగా, తన డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని అసలు రూ.2.5 కోట్లకు వడ్డీ రూ.50 లక్షలు అయిందని, అందువల్ల తనకు మొత్తం రూ.3 కోట్లు చెల్లించేలా అమీషా పటేల్‌‍ను ఆదేశించాలని అజయ్ కుమార్ కోర్టును కోరారు. 
 
నిర్మాత పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న రాంచీ కోర్టు ఏప్రిల్ 6వ తేదీన అమీషా పటేల్‌‍పై వారెంట్ జారీ చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆమె శనివారం కోర్టుకు న్యాయమూర్తి ఎదుట లొంగిపోయారు. ఆ తర్వాత ఆమెకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేశారు. 
 
కాగా, కోర్టు వెలువల మీడియా హడావుడిన చూసిన అమీషా పట్లే ముఖం కనిపించకుండా ముసుగు ధరించి కారెక్కి గుట్టు చప్పుడు కాకుండా వెళ్లిపోయారు. కాగా, పవన్ కళ్యాణ్ నటించిన బద్రి చిత్రంలో అమీషా పటేల్ హీరోయిన్‌గా నటించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments