Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మాతను మోసం చేసిన హీరో పవన్ కళ్యాణ్ హీరోయిన్

Webdunia
ఆదివారం, 18 జూన్ 2023 (09:36 IST)
ఓ నిర్మాతను హీరో పవన్ కళ్యాణ్ హీరోయిన్ మోసం చేసింది. 'బద్రి' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన అమీషా పటేల్ ఈ మోసానికి పాల్పడ్డారు. దీంతో ఆమె కోర్టులో లొంగిపోయారు. ఆమె జార్ఖండ్ రాష్ట్రంలోని ఓ కోర్టులో లొంగిపోయారు. సినిమా ప్రొడక్షన్ పేరిట అమీషా పటేల్ తన నుంచి రూ.2.50 కోట్లను అప్పుగా తీసుకుని, తన డబ్బు ఎగ్గొట్టారంటూ నిర్మాత, వ్యాపారవేత్త అయిన అజయ్ కుమార్ రాంచీ కోర్టును ఆశ్రయించారు. 
 
పైగా, తన వద్ద తీసుకున్న డబ్బులతో సినిమాను పూర్తి చేయకపోగా, తన డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని అసలు రూ.2.5 కోట్లకు వడ్డీ రూ.50 లక్షలు అయిందని, అందువల్ల తనకు మొత్తం రూ.3 కోట్లు చెల్లించేలా అమీషా పటేల్‌‍ను ఆదేశించాలని అజయ్ కుమార్ కోర్టును కోరారు. 
 
నిర్మాత పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న రాంచీ కోర్టు ఏప్రిల్ 6వ తేదీన అమీషా పటేల్‌‍పై వారెంట్ జారీ చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆమె శనివారం కోర్టుకు న్యాయమూర్తి ఎదుట లొంగిపోయారు. ఆ తర్వాత ఆమెకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేశారు. 
 
కాగా, కోర్టు వెలువల మీడియా హడావుడిన చూసిన అమీషా పట్లే ముఖం కనిపించకుండా ముసుగు ధరించి కారెక్కి గుట్టు చప్పుడు కాకుండా వెళ్లిపోయారు. కాగా, పవన్ కళ్యాణ్ నటించిన బద్రి చిత్రంలో అమీషా పటేల్ హీరోయిన్‌గా నటించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ ఎన్నికల ఫలితాలు.. రాజకీయాలు వద్దు.. హిమాలయాలకు జగన్?

ఇంటి వద్దకే ఫించన్.. భారతదేశంలో ఇదే తొలిసారి.. చంద్రబాబు అదుర్స్

ఇన్‌స్టాగ్రాంలో పరిచయం, 8వ తరగతి బాలికపై 23 ఏళ్ల యువకుడు అత్యాచారం

హైదరాబాద్ రెస్టారెంట్‌ బిర్యానీలో స్లైడ్ పిన్.. నెట్టింట ఫోటో వైరల్

కాకినాడలో రేషన్ మాఫియా.. సీఐడీ విచారణ జరిపించాలి.. నాదెండ్ల మనోహర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

రాగులు ఎందుకు తినాలో తప్పక తెలుసుకోవాలి

తర్వాతి కథనం
Show comments