Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ స్కూల్ లైసెన్స్ రద్దయ్యేంత వరకు పోరాటం : శివబాలాజీ

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (16:41 IST)
తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూళ్ళ ఫీజుల దోపిడీపై సినీ నటుడు శివబాలాజీ పోరాటం చేస్తున్నారు. ఇందులోభాగంగా, హైదరాబాద్ మణికొండలో ఉన్న మౌంట్ లిటేరా జీ స్కూల్లో చదువుతున్న తన పిల్లలను ఎలాంటి కారణం లేకుండానే ఆన్‌లైన్ క్లాసుల నుంచి తొలగించారంటూ ఆరోపించారు. ఆ తర్వాత ఆయన నేరుగా తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. 
 
ఆన్‌లైన్ క్లాసుల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ తాను చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు ఎంత వరకు వచ్చిందో తెలుసుకునేందుకు సోమవారం డీఈవోను ఆయన కలిశారు. ఆయనతో పాటు ఆయన భార్య మధుమిత కూడా వచ్చారు.
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన ఫిర్యాదుపై హెచ్చార్సీ చాలా వేగంగా స్పందించిందన్నారు. స్కూల్ నుంచి స్పందన వచ్చిందని, తమ పిల్లల ఆన్‌లైన్ క్లాసులకు యాక్సెస్ ఇచ్చారని చెప్పారు. అయితే తమ పిల్లలను ఎందుకు తొలగించారో స్కూల్ యాజమాన్యం చెప్పాలని డిమాండ్ చేశారు. 
 
టెక్నికల్ సమస్య వల్ల అలా జరిగిందని స్కూల్ వాళ్లు చెపుతున్నారని అన్నారు. కానీ, కావాలనే ఇలా చేశారని, దానికి సంబంధించిన ఆధారాలను డీఈవోకి ఇచ్చామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం జరగకపోతే స్కూల్ లైసెన్స్ రద్దయ్యేంత వరకు పోరాడుతామని చెప్పారు. డీఈవోకు అన్ని విషయాలను వివరించామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vizag Beach Road: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం.. వైజాగ్ ముస్తాబు

జగన్ తీరు అలీబాబా 40 దొంగల మాదిరిగా ఉంది : ఫోన్ ట్యాపింగ్‌పై వైఎస్ షర్మిల

నా దారి రహదారి అని ఏపీ పోలీసులకు తెలియదనుకుంటా: హెల్మెట్ లేకుండా యువతి వీడియో తీస్తూ డ్రైవింగ్ (video)

FASTag: ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక టోల్ పాస్‌లు.. పవన్ కల్యాణ్ స్పందన ఏంటి?

కొండా సురేఖకు కేటాయించిన శాఖలో పైసలు రావు .. ఖర్చులకు నేనే ఇస్తా : కొండా మురళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments