Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌‌తో సినీ ప్రముఖుల భేటీ: అక్కినేని నాగార్జున ఎందుకు హాజరు కాలేదంటే?

Webdunia
శనివారం, 12 ఫిబ్రవరి 2022 (12:20 IST)
టాలీవుడ్‌ సమస్యలపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ను సినీ ప్రముఖులు కలిసిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో రాజమౌళి, మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ తదితరులు పాల్గొన్నారు. కానీ ఈ సమావేశంలో అక్కినేని నాగార్జున పాల్గొనలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం లేనందుకే నాగార్జున ఈ సమావేశానికి దూరమయ్యారని తెలుస్తోంది.  
 
కాగా అక్కినేని నాగార్జున గతంలోనే సీఎం జగన్‌ను కలిశారు. మూడు నెలల క్రితం నిర్మాతలు నిరంజన్‌ రెడ్డి, ప్రీతం రెడ్డిని వెంటబెట్టుకుని జగన్‌తో సమావేశమయ్యారు. కాగా నేటి సమావేశానికి కూడా ఎక్కువమందికి అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని సినీ పెద్దలు కోరారు. 
 
అయితే కొవిడ్‌ కారణంగా తక్కువ మందే రావాలని మంత్రి పేర్నినాని సూచించడంతోనే పరిమిత సంఖ్యలోనే సినీ ప్రముఖులు జగన్‌తో భేటీ అయ్యారు. అందులో భాగంగానే నాగార్జున హాజరుకాలేదని తెలుస్తోంది. 
 
నాగార్జునతో పాటు యంగ్ టైగర్‌ కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు. కాగా సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ అనంతరం టాలీవుడ్‌ సమస్యలకు ఎండ్ కార్డు కాదు శుభం కార్డు పడుతుంని మెగాస్టార్‌ చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల శ్రీవారి ఆలయం, చిత్రాలతో మొబైల్ గేమ్.. తాటతీస్తామన్న బీఆర్ నాయుడు

PUBG : పబ్‌జీతో పరిచయమైన వ్యక్తితో వివాహిత జంప్.. వెయ్యి కిలోమీటర్ల జర్నీ

West Bengal Horror: లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

Raj Tarun, Lavanya: లావణ్యకు బిగ్ షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. ఏంటది?

Bengaluru : ఫ్రెండ్స్‌తో గొడవ.. రీల్స్ చేద్దామని 13 అంతస్థుకు వెళ్లింది.. జారిపడి యువతి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments