Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిని, భార్యను బూతులు తిడితే ఊరుకోవాలా?: కత్తి మహేష్

సినీ విశ్లేషకుడు కత్తి మహేష్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు మధ్య వార్ జరుగుతూనే వుంది. ఈ యుద్ధానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తెరదించుతారా? లేదా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ప్రతీసారీ పవన్‌ను టా

Webdunia
ఆదివారం, 7 జనవరి 2018 (12:06 IST)
సినీ విశ్లేషకుడు కత్తి మహేష్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు మధ్య వార్ జరుగుతూనే వుంది. ఈ యుద్ధానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తెరదించుతారా? లేదా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ప్రతీసారీ పవన్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించే కత్తి మహేష్ అంటేనే పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
 
ఇటీవల పవన్‌కు మద్దతుగా కత్తిపై హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. దీంతో కత్తి మహేష్‌ పవన్, పూనమ్ కౌర్‌కు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. తనతో చర్చకు రావాలని సవాల్ విసిరాడు. అయితే కత్తి సవాలును పూనమ్, పవన్ పట్టించుకోలేదు. అంతే మళ్లీ ప్రెస్ క్లబ్‌లో కత్తి మహేష్.. పవన్‌పై ఫైర్ అయ్యాడు.
 
రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేదని, తాను పది ప్రశ్నలు వేస్తే, ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదని కత్తి మహేష్ అన్నాడు. ఆదివారం ప్రెస్ క్లబ్ వేదికగా, మీడియాతో మాట్లాడిన కత్తి పవన్ ఫ్యాన్స్ పై విరుచుకుపడ్డాడు. తన తల్లిని, భార్యను నోటితో చెప్పలేని విధంగా బూతులు తిడుతుంటే తాను చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించాడు. ఫ్యాన్స్‌ను నియంత్రించలేని స్థితిలో పవన్ ఉన్నాడని ఆరోపించాడు. 
 
తాను పవన్ లేదా పూనం కౌర్‌ను చర్చించేందుకు రమ్మని ఆహ్వానం పంపించానని, కానీ వారు రాలేదని కత్తి మహేష్ ఆరోపించాడు. తనను సామాజిక బహిష్కరణ చేయాలని కోన వెంకట్ చేసిన డిమాండును ప్రస్తావిస్తూ, ఓ దళితుడిగా తాను ఎన్నోసార్లు సామాజిక బహిష్కరణను చూశానని, సినీ ఇండస్ట్రీ నుంచి కూడా బహిష్కరించారని ఆరోపించాడు.
 
ముందు చెప్పినట్టుగానే తాను వచ్చేశానని, పవన్, పూనమ్‌తో చర్చకు సిద్ధంగా ఉన్నానని అన్నాడు. కానీ వాళ్లిద్దరూ రాలేదని.. తాను చెప్పదలచుకున్న విషయాన్ని చెప్తానని.. మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వనని స్పష్టం చేశాడు. తన వెనుక ఏ రాజకీయ పార్టీ లేదని కత్తి వెల్లడించాడు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments