Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముమైత్ వద్ద 7 గంటలపాటు విచారణ : ఏం చెప్పారంటే..

Webdunia
గురువారం, 16 సెప్టెంబరు 2021 (10:39 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో నటి ముమైత్ ఖాన్ వద్ద ఏడు గంటల పాటు విచారణ సాగింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట ఆమె బుధవారం హాజరయ్యారు. 
 
ఆమె వద్ద దాదాపు 7 గంటలపాటు కొనసాగిన విచారణలో ముమైత్‌కు ఈడీ అధికారులు పలు ప్రశ్నలను సంధించారు. ప్రధానంగా ఈ కేసులో కీలక నిందితులైన జీషాన్, కెల్విన్‌లతో గల ఆర్థిక సంబంధాలపై ఆమెను ప్రశ్నించారు. ఈడీ ప్రశ్నలకు బదులుగా ముమైత్ ఖాన్ బదులిస్తూ, తన స్నేహితులతో కలిసి హైదరాబాదులో తాను కొన్ని పార్టీల్లో పాల్గొన్నానని, ఆ పార్టీల్లో డ్రగ్స్ వినియోగించలేదన్నారు. 
 
ఆ సమయంలోనే డ్రగ్ సప్లయర్స్ కెల్విన్, జీషాన్‌లు తనకు అక్కడే తెలుసని... అయితే, వారితో తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేవని ఆమె చెప్పింది. తన బ్యాంక్ స్టేట్మెంట్లను కూడా ఈడీ అధికారులకు ముమైత్ అందజేసింది.
 
మరోవైపు అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలపై ముమైత్ నుంచి ఈడీ అధికారులు వివరణ తీసుకున్నారు. హీరో నవదీప్‌కు చెందిన ఎఫ్ క్లబ్ కు ముమైత్ ఖాతా నుంచి డబ్బు బదిలీ అయినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. వీటిపై ఈడీ అధికారులు ప్రశ్నించగా... అవి కేవలం పార్టీలకు సంబంధించిన లావాదేవీలేనని ముమైత్ సమాధానమిచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KA Paul: చిన్నవాడైన రామ్మోహన్‌కి ఏవియేషన్‌పై అవగాహన లేదు: కే.ఏ.పాల్

భారత్‌లో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాల నిలిపివేత!?

India: దేశంలో ఏడువేల యాక్టివ్ కేసులు.. ఏపీ, తెలంగాణల్లో కేసులెన్ని?

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం: ఆరుగురు చిత్తూరు వాసులు మృతి

10 నిమిషాలు ఆలస్యమై విమానం ఎక్కలేకపోయింది, బతికి బైటపడింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments