Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్ టిక్కెట్ సిస్టమ్ కావాలని మేమే కోరాం : దిల్ రాజు

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (19:38 IST)
సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లోనే విక్రయించాలని తామే ఏపీ ప్రభుత్వాన్ని కోరామని ప్రముఖ నిర్మాత దిల్ రాజు చెప్పారు. ఏపీ మంత్ర మంత్రి పేర్ని నానితో పలువురు టాలీవుడ్ నిర్మాతలు బుధవారం సమావేశమయ్యారు. 
 
ఈ సమావేశం తర్వాత నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, గతంలోనే ముఖ్యమంత్రి జగన్‌ను చిరంజీవి, నాగార్జున, రాజమౌళితో పాటు కలిశామన్నారు. సినీ పరిశ్రమపై కరోనా ప్రభావంతో పాటు ఇతర సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. 
 
సినీ పరిశ్రమ చాలా సున్నితమైనదని, దయచేసి ఇండస్ట్రీని వివాదాలకు దూరంగా ఉంచాలని కోరారు. టికెట్లను ఆన్‌లైన్లో అమ్మాలని పరిశ్రమ తరపున ప్రభుత్వాన్ని తామే కోరామని చెప్పారు. ఆన్‌లైన్ విధానం ద్వారా పారదర్శకత వస్తుందని అన్నారు.
 
అయితే గత చర్చల సారాంశాన్ని సినీ పరిశ్రమకు వివరించలేకపోయామని... అందువల్లే ప్రస్తుత పరిణామాలు నెలకొన్నాయని చెప్పారు. ఆన్‌లైన్ విధానం ఎలా ఉండబోతోందో స్పష్టతను ఇవ్వాలని పేర్ని నానిని కోరామని తెలిపారు. దీనిపై రానున్న సమావేశాల్లో క్లారిటీ వస్తుందని దిల్ రాజు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముంబైలో వినాయకుడి మండపానికి రూ.474 కోట్ల బీమా

బాలికపై లైంగికదాడికి యత్నించిన బాలుడు.. ఎదురు తిరగడంతో కత్తితోపొడిచి...

వీళ్లేమో వీధి కుక్కల్ని చంపొద్దంటారు, అవేమో ప్రజల పిక్కల్ని పీకుతున్నాయి

ఆపరేషన్ సిందూరు సమయంలో పాక్ నౌకలు మాయం

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments