Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవితేజ ఆవిష్క‌రించిన మధురానగరిలో యమునా తటిలో- పాట‌

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (19:06 IST)
Pelli Sanda D
కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతున్న‌ చిత్రం ‘పెళ్లి సంద‌D’. ఈ బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ఆయ‌న శిష్యురాలు గౌరి రోణంకి డైరెక్ట్ చేస్తున్నారు. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో  మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
దసరా సందర్భంగా ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల రూప‌క‌ల్ప‌న‌లో త‌న మేజిక్‌ను చూపిన ఈయ‌న ‘పెళ్లిసంద‌D’ లో అతిథి పాత్ర‌లో న‌టించ‌డం విశేషం. ఈ చిత్రం నుంచి ‘మధురానగరిలో యమునా తటిలో...’  అనే లిరికల్ పాట‌ను మాస్ మహారాజా ర‌వితేజ విడుద‌ల చేశారు. సినిమా పెద్ద హిట్ కావాల‌ని చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు. 
ఈ పాట‌ను చంద్ర‌బోస్ రాశారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. శ్రీనిధి, నయ‌నా నాయ‌ర్‌, కాల భైర‌వ పాడారు. 
 
ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చాయి. అలాగే టీజ‌ర్‌, రీసెంట్‌గా సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ రిలీజ్ చేసిన ట్రైల‌ర్‌కు కూడా అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు మధురానగరిలో అనే లిరికల్ సాంగ్ కూడా విడుదలైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

విమాన ప్రమాదం : విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు - అప్పగింత

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 31 మృతదేహాల గుర్తింపు.. మిగిలినవాటి పరిస్థితి ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments