Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ఎళ్ళిపోమాకే' అంటున్న నాగచైతన్య.. సాహసం ఆడియో త్వరలో!

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (19:46 IST)
'ఏ మాయ చేసావే' సినిమాతో మ్యాజిక్‌ చేసిన హీరో నాగ చైతన్య, దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ల క్రేజీ కాంబినేషన్‌లో మరో సినిమా అనగానే ఆ సినిమాకు ఏ స్థాయి అంచనాలు ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. ఆ అంచనాలను రెట్టింపు చేసేలా 'సాహసం శ్వాసగా సాగిపో' అనే టైటిల్‌ పెట్టి, 'ఏ మాయ చేసావే' ఫీల్‌ను తలపించేలా టీజర్‌, పోస్టర్స్‌ రిలీజ్‌ చేసి సినిమాపై మంచి ఆసక్తి రేకెత్తించారు. షూటింగ్‌ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెలాఖర్లో ఆడియో రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
 
ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని 'ఎళ్ళిపోమాకే' అనే పాట సూపర్‌ హిట్‌ కాగా, నిన్న శోకిల్లా అనే మరో పాట టీజర్‌ను కూడా విడుదల చేసి సినిమాకు ఆడియో ఓ హైలైట్‌గా నిలవనుందని స్పష్టం చేసినట్లైంది. ఇక ఈవారమే ఆడియో రిలీజ్‌ చేపట్టాలని ప్లాన్‌ చేసినా, సంగీత దర్శకుడు ఏ.ఆర్‌.రెహమాన్‌ ఓ ప్రత్యేక కన్సర్ట్‌ కోసం అమెరికా వెళ్ళడంతో ఆయన వచ్చేంత వరకూ ఆడియో రిలీజ్‌ చేయట్లేదు.
 
మే నెలాఖర్లో రెహమాన్‌ రాగానే ఆడియో రిలీజ్‌ కానుంది. తెలుగులో ఈ సినిమాను నిర్మిస్తోన్న కోన వెంకట్‌ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ వర్షన్‌కు శింబు హీరోగా నటించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్య కళ్ళలో కారం చల్లాడు.. పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు.. జీవితఖైదు

Maharashtra: ఫోన్ చూసుకుంటున్న తండ్రి, నాలుగేళ్ల బాలుడిపై ఎక్కి దిగిన కారు.. ఎక్కడ? (video)

195 ఎర్రచందనం దుంగల స్వాధీనం.. పోలీసులను అభినందించిన డిప్యూటీ సీఎం పవన్

తిరుమల నందకం అతిథి గృహంలో దంపతుల ఆత్మహత్య.. చీరతో ఉరేసుకుని?

ఫిబ్రవరి 24న ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments