Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన వారిని ఫెయిల్యూల్ నటులు అంటారు : వితిక సందేశ్

వరుణ్
సోమవారం, 17 జూన్ 2024 (14:35 IST)
సినిమాలు ఇక వద్దు అని చిత్రపరిశ్రమను వీడి వెళ్లిపోయిన వారిని ఫెయిల్యూర్ నటులు అంటారని హీరో వరుణ్ సందేశ్ భార్య వితిక అన్నారు. కానీ, తన భర్త 17 యేళ్లుగా చిత్రపరిశ్రమను నమ్ముకుని ఇంకా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారని ఆమె గుర్తు చేశారు. 
 
వరుణ్‌ సందేశ్‌ కథానాయకుడిగా రూపొందిన చిత్రం 'నింద'. యథార్థ సంఘటనల ఆధారంగా రాజేశ్‌ జగన్నాథం దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. జూన్‌ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. అందులో వరుణ్‌ సందేశ్‌ భార్య వితిక భావేద్వేగానికి గురయ్యారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 'చాలా రోజుల తర్వాత వరుణ్‌ సినిమా ఫంక్షన్‌కు రావడం ఆనందంగా ఉంది. 'నింద' ప్రమోషన్స్‌లో ఆయన్ని చాలామంది తన కెరీర్‌ ఫెయిల్యూర్‌పై ప్రశ్నలు అడుగుతున్నారు. 'మీకు అవకాశాలు రావడం లేదు కదా.. మీరు ఫెయిల్డ్‌ యాక్టర్‌ కదా' ఇలా ప్రశ్నిస్తున్నారు. 
 
నిజం చెప్పాలంటే వరుణ్‌ ఫెయిల్యూర్‌ యాక్టర్‌ కాదు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ల నుంచి ఎన్నో చిత్రాల్లో నటించారు. సినిమాలు వద్దు అని పరిశ్రమ నుంచి వెళ్లిపోయిన వాళ్లను ఫెయిల్యూర్‌ యాక్టర్‌ అంటారు. వరుణ్‌ అలా చేయలేదు. ఇండస్ట్రీనే నమ్ముకున్నాడు. ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ప్రతీ చిత్రానికి 100 శాతం న్యాయం చేస్తాడు. 'నింద' మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా' అని వితిక ఆకాంక్షించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంగళగిరి ఎయిమ్స్‌లో నీటి కొరతా.. చంద్రబాబు ఇచ్చిన హామీ ఏంటి?

Dharmapuri Srinivas కన్నుమూత.. బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతూ..

ద్వారంపూడిని టార్గెట్ చేసిన పవన్ కల్యాణ్... అలవాట్లు మార్చుకోండి..

పోలవరం.. విభజన కంటే జగన్‌తో రాష్ట్రానికి ఎక్కువ నష్టం: చంద్రబాబు

ఒకే వేదికను పంచుకోనున్న టి.సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

రాగులు ఎందుకు తినాలో తప్పక తెలుసుకోవాలి

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

తర్వాతి కథనం
Show comments