Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేక్షకులే భక్తులు.. నేను బస్సును నడిపే డ్రైవర్‌ను : కళాతపస్వి (టీజర్)

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (10:50 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో హిమాలయా పర్వతమంత ఎత్తులో ఉండే దర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాథ్. పూర్తి పేరు కాశీనాథుని విశ్వనాథ్. ఈయన జీవిత చరిత్ర ఆధారంగా విశ్వదర్శనం అనే పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి జనార్థన్ మహర్షి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్‌ ప్రసాద్, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 
 
ఈ సినిమా టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. 'వందేళ్ల వెండితెర చెబుతున్న తొంభై ఏళ్ల బంగారు దర్శకుడి కథ' అన్న లేడీ వాయిస్ డైలాగ్‌తో ఈ టీజర్ ప్రారంభమవుతుంది. రాధికా శరత్‌కుమార్‌, సుశీల, భానుప్రియ, ఆమని, శైలజ, విజయేంద్ర ప్రసాద్‌ తదితరులు విశ్వనాథ్‌ గొప్పతనం గురించి టీజర్‌లో వివరించారు.
 
ఈ టీజర్‌లో యంగ్ విశ్వనాథ్‌కు సంబంధించిన అలనాటి ఫొటోలను అద్భుతంగా చూపించారు. 'సినిమా అనే ఓ బస్సును పట్టుకుని, సినిమా చూసేవారు ప్రేక్షకులను భక్తులుగా భావించి.. నేను బస్సు నడిపే డ్రైవర్‌ను. ఏం చేయాలి నేను?' అంటూ టీజర్ ఆఖర్లో విశ్వనాథ్‌ చెప్పే డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

Balochistan: పాకిస్తాన్‌కు వీడ్కోలు, బలూచిస్తాన్‌కు స్వాగతం.. పాక్ జెండాలు దిగిపోయాయ్

Jagan Predicts: 2029లో కాదు, ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు: జగన్మోహన్ రెడ్డి జోస్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments