Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఆర్ఆర్‌పై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి.. ఆ చిత్రానికి ఏమాత్రం తీసిపోదట...

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (09:51 IST)
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం "ఆర్.ఆర్.ఆర్". ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌లు నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఏకంగా రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. 
 
అలాంటి చిత్రం చిత్ర కథ ఏమైవుంటుందన్న సంశయం ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. దీంతో ట్రిపుల్ ఆర్‌పై రాజమౌళి స్పందించారు. ఈ చిత్రం గతంలో వచ్చిన 'బాహుబలి' చిత్రానికి ఏమాత్రం తీసిపోదని స్పష్టంచేశారు. పైగా, ఇది 'పాన్ ఇండియా' చిత్రమని చెప్పారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 
 
ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఈ చిత్రానికి సంబంధించిన సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. రామ్ చరణ్‌పై పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఇదొక పిరియాడికల్ మూవీ అని ఇప్పటికే టాక్ నడుస్తోంది. ఇటీవల లీక్ అయిన కొన్ని షూటింగ్ తాలుకు ఫోటోలు కూడా ఈ విషయాన్ని ధృవ పరుస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి స్మగ్లర్ల సాహసం : పోలీసుల వాహనాన్నే ఢీకొట్టారు.. ఖాకీల కాల్పులు..

రన్‌వేను బలంగా ఢీకొట్టిన విమానం తోకభాగం... ఎక్కడ?

ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద కాల్పుల కలకలం

ఆపరేషన్ సిందూర్‌తో భారీ నష్టం - 13 మంది సైనికులు మృతి

ఒరిస్సా వాసుల పంట పడింది... పలు జిల్లాల్లో బంగారు నిక్షేపాలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments