Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ప్రేమెంత పనిచేసె నారాయణ' రిలీజ్ తేదీ ఖరారు..

prema entha pani chese narayana
Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (17:31 IST)
జొన్నలగడ్డ శ్రీనివాసరావు గారు తన కుమారుడైన హరికృష్ణను మొదటి సారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేస్తున్నారు. హరికృష్ణ మొదటి చిత్రానికి తన తండ్రి జొన్నలగడ్డ శ్రీనివాసరావుగారే దర్శకత్వం వహించారు. చిత్రం పేరు 'ప్రేమెంత పనిచేసె నారాయణ'. ఇందులో అక్షిత హీరోయిన్‌గా నటించారు. అలానే ఝాన్సీ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు.  
 
సావిత్రి జొన్నల గడ్డ నిర్మించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 22వ తేదీనా విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నటుడు శ్రీకాంత్ వచ్చారు. ఈ సినిమా సంగీత దర్శకుడు యాజమాన్యకు తొలి జ్ఞాపికను అందజేశారు. శ్రీకాంత్ మాట్లాడుతూ జొన్నలగడ్డ శ్రీనివాసరావుగారికి సినిమాలు తప్ప మరో ప్రపంచం తెలియదని.. ఆయన కుమారుడు హరికృష్ణని హీరోగా పరిచయం చేస్తూ... తనే ఈ చిత్రానికి అన్ని బాధ్యతలను తీసుకుని శ్రమించారని చెప్పుకొచ్చారు.
 
అంతేకాదు.. హరి బాగా హార్డ్‌వర్క్ చేస్తాడు. ఇంకా చెప్పాలంటే.. భవిష్యత్తులో హరి మంచి స్టార్ హీరో అవుతాడని శ్రీకాంత్ అన్నారు. తరువాత శ్రీనివాసరావుగారు మాట్లాడుతూ.. కథను నమ్మి చేసిన చిత్రమిది. ఈ కథకు ఎంతో మంది ఎన్నెన్నో సలహాలు ఇచ్చారు. కానీ, నాకు నచ్చలేదు.. అందుకే నేను తీయాలనుకున్నది తీసాను అన్నారు. అలానే హిందీ డబ్బింగ్ రైట్స్‌కు కూడా ఈ చిత్రానికి మంచి ధర దక్కింది. ఈ సినిమాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న నిర్మాత అల్లు అరవింద్‌గారి సహకారం మర్చిపోలేనిదని చెప్పారు. చివరగా హరి.. ప్రేమకు ఓ కొత్త అర్థం చెప్పే చిత్రమిది. అంతేకాదు.. స్నేహం విలువను చాటిచెప్పే కథ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Indus Waters Treaty పాకిస్తాన్ పీచమణచాలంటే సింధు జల ఒప్పందం రద్దు 'అణు బాంబు'ను పేల్చాల్సిందే

24 Baby Cobras: కన్యాకుమారి.. ఓ ఇంటి బీరువా కింద 24 నాగుపాములు

బందీపొరాలో లష్కరే టాప్ కమాండర్ హతం

మనమిద్దరం నల్లగా ఉంటే బిడ్డ ఇంత తెల్లగా ఎలా పుట్టాడు? భార్యను ప్రశ్నించిన భర్త... సూసైడ్

పహల్గామ్ ఊచకోతలో పాల్గొన్న స్థానిక ఉగ్రవాదులు: ఆ ఇంటి తలుపు తీయగానే పేలిపోయింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments