Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడిగర్ సంఘం భవనం నిర్మాణం.. విశాల్ - నాజర్‌లకు హైకోర్టు నోటీసులు

తమిళనాడు నడిగర్ సంఘం భవన నిర్మాణ ఒప్పందం వ్యవహారంలో లోకనాయకుడు కమలహాసన్, నాజర్, విశాల్, ఎస్‌వీ.శేఖర్ తదితర తొమ్మిది మందికి మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ వివరాలను పరిశీలిస్తే... చెన్నై తాంబ

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2016 (13:04 IST)
తమిళనాడు నడిగర్ సంఘం భవన నిర్మాణ ఒప్పందం వ్యవహారంలో లోకనాయకుడు కమలహాసన్, నాజర్, విశాల్, ఎస్‌వీ.శేఖర్ తదితర తొమ్మిది మందికి మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ వివరాలను పరిశీలిస్తే... చెన్నై తాంబరానికి చెందిన వారాహి అనే నడిగర్‌ సంఘం సభ్యుడు మద్రాసు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. 
 
భవన నిర్మాణ నిర్ణయం ఏకపక్షమని, తమతో చర్చించకుండానే, బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీకి కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించారు. కాబట్టి ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని సంఘ సభ్యులందరితో చర్చించి కొత్త ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారు. 
 
వారాహి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం నడిగర్‌ సంఘం అధ్యక్షుడు నాజర్ , కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీ, సంఘ ట్రస్ట్ సభ్యులు కమలహాసన్, కుట్టిపద్మిని, ఎస్‌వీ.శేఖర్, పూచిమురుగన్ మొదలగు తొమ్మిది మందికి నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments