Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడిగర్ సంఘం భవనం నిర్మాణం.. విశాల్ - నాజర్‌లకు హైకోర్టు నోటీసులు

తమిళనాడు నడిగర్ సంఘం భవన నిర్మాణ ఒప్పందం వ్యవహారంలో లోకనాయకుడు కమలహాసన్, నాజర్, విశాల్, ఎస్‌వీ.శేఖర్ తదితర తొమ్మిది మందికి మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ వివరాలను పరిశీలిస్తే... చెన్నై తాంబ

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2016 (13:04 IST)
తమిళనాడు నడిగర్ సంఘం భవన నిర్మాణ ఒప్పందం వ్యవహారంలో లోకనాయకుడు కమలహాసన్, నాజర్, విశాల్, ఎస్‌వీ.శేఖర్ తదితర తొమ్మిది మందికి మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ వివరాలను పరిశీలిస్తే... చెన్నై తాంబరానికి చెందిన వారాహి అనే నడిగర్‌ సంఘం సభ్యుడు మద్రాసు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. 
 
భవన నిర్మాణ నిర్ణయం ఏకపక్షమని, తమతో చర్చించకుండానే, బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీకి కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించారు. కాబట్టి ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని సంఘ సభ్యులందరితో చర్చించి కొత్త ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారు. 
 
వారాహి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం నడిగర్‌ సంఘం అధ్యక్షుడు నాజర్ , కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీ, సంఘ ట్రస్ట్ సభ్యులు కమలహాసన్, కుట్టిపద్మిని, ఎస్‌వీ.శేఖర్, పూచిమురుగన్ మొదలగు తొమ్మిది మందికి నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది. 
 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments