కబాలి హీరోయిన్ రాధికా ఆప్తే పర్చేద్ సినిమా ద్వారా మళ్ళీ వార్తల్లో నిలిచింది. ఈ సినిమాలో న్యూడ్ హాట్ సీన్స్ ఇటీవలే సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. ఈ సినిమా ద్వారా రాధికా ఆప్టేను మోసం చేశారని సన్నిహితులతో
కబాలి హీరోయిన్ రాధికా ఆప్తే పర్చేద్ సినిమా ద్వారా మళ్ళీ వార్తల్లో నిలిచింది. ఈ సినిమాలో న్యూడ్ హాట్ సీన్స్ ఇటీవలే సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. ఈ సినిమా ద్వారా రాధికా ఆప్టేను మోసం చేశారని సన్నిహితులతో ఆప్టే చెప్పినట్లు బిటౌన్లో వార్తలు షికార్ చేస్తున్నాయి.
ఇంతకీ విషయం ఏమిటంటే.. రక్తచరిత్ర, లెజెండ్, కబాలి సినిమాల్లో చీరకట్టుతో ప్రేక్షకులను అలరించిన రాధికా ఆప్టే.. అజయ్దేవ్గన్ రూపొందించిన ఆ సినిమాలో మాత్రం రెచ్చిపోయింది. అందాలను బాగానే ఆరబోసింది. కానీ సదరు హాట్ సీన్లలో నటించేందుకు రాధికా ఆప్టే ఓ కండిషన్ పెట్టిందట. ముందు రాధికా కండిషన్కు ఓకే చెప్పిన సినీ యూనిట్ ఆ తర్వాత ఆ మాట తప్పిందట.
తొలుత పర్చేద్ సినిమాను భారత్లో విడుదల చేయమన్నారట. ఒకవేళ విడుదల చేసినా ఆ శృంగార సన్నివేశాలను పూర్తిగా తొలగిస్తామని తెలిపారట. దీంతో ఆ సన్నివేశాల్లో నటించడానికి రాధిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కానీ ఆ సీన్లు ఇంటర్నెట్లో హల్ చల్ చేయడంతో రాధికా ఆప్టే షాక్ అయ్యిందట.
అంతటితో ఈ కథ ముగిసిపోయిందనుకుంటే.. ఇంటర్నెట్లో రిలీజైన శృంగార దృశ్యాలు కేవలం నాలుగు నిమిషాలేనని, అయితే 20 నిమిషాలతో కూడిన హాట్ సన్నివేశాలను ప్రస్తుతం సీడీల రూపంలో కోల్కతాలో అమ్మేస్తున్నారట. ఈ సీడీలు సైతం భారీ ధర పలకడం ద్వారా సినీ యూనిట్ బాగానే క్యాష్ చేసుకుంటున్నారట.
దీనిపై రాధికా ఆప్టే తనను మోసం చేశారని సినీ యూనిట్పై ఫైర్ అయ్యిందట. అజయ్పై కూడా కోపం ప్రదర్శించిందట. మరి ఈ వ్యవహారాన్ని ఆయనెలా డీల్ చేస్తారో వేచి చూడాలి.