Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈడీ విచారణ గురించి విజయ్‌దేవరకొండ ఒక్కటే మాట!

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2022 (10:11 IST)
Vijaydevarakondat ed office media
ఇటీవలే లైగర్‌ దర్శకుడు, నిర్మాత అయిన పూరీ జగన్నాథ్‌, చార్మికౌర్‌లను ఈడీ అధికారులు హైదరాబాద్‌లో విచారించారు. లైగర్‌ సినిమాకు కోట్ల రూపాయల పెట్టుబడి ఎలా వచ్చింది? అసలు వీటి వెనుక పెట్టుబడిదారులు ఎవరున్నారనేది అడిగారు. ఆ తర్వాత వారినుంచి ఎటువంటి సమాధానం మీడియాకు రాలేదు. కాగా, బుధవారంనాడు లైగర్‌ హీరో విజయ్‌దేవరకొండను దాదాపు 11గంటలపాటు ఈడీ అధికారులు తమ కార్యాలయంలో విచారణ చేశారు.
 
అనంతరం విజయ్‌దేవరకొండ మీడియా ముందు మాట్లాడుతూ, పేరు, ప్రఖ్యాతులు వస్తే ఇలాంటివి ఎదుర్కోవాల్సివుంటుంది. ప్రేక్షకుల ప్రేమ, అభిమానం ఎల్లప్పుడూ తనకు తోడుగా వుంటుందని తెలిపారు. ఈడీ అధికారులు విధి నిర్వహణలో భాగంగా వారు తనను విచారణ చేశారనీ, త్వరలో అన్నీ సమసిపోతాయని ఆశిస్తున్నానని అన్నారు. 
 
లైగర్‌ సినిమా వసూళ్ళు రాబట్టలేకపోయింది. విడుదలైన అన్నిచోట్ల నెగెటివ్‌ టాక్‌తో ప్లాప్‌ సినిమాగా మారింది. మరి ఈడీ అధికారులు ఎందుకు లైగర్‌ టీమ్‌ను విచారిస్తున్నారనేది క్లారిటీలేదు. దీనివెనుక రాజకీయకోణం దాగివుందని సినీవిశ్లేషకులు తెలియజేస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments