Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనసు నిండిన మీ ఆదరణకు... ఇప్పటికి ఇక శెలవు....

Webdunia
సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (14:43 IST)
మాజీ ఎంపీ, సీనియర్ నటి విజయశాంతి తాజాగా చేసిన ట్వీట్ ఇపుడు వైరల్ అయింది. ఇప్పటికి ఇక శెలవు అంటూ ఆమె ట్వీట్ చేశారు. దాదాపు పుష్కరకాలం తర్వాత విజయశాంతి వెండితెరకు రీఎంట్రీ ఇచ్చారు. ప్రిన్స్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో అత్యంత కీలకమైనపాత్రను పోషించి మెప్పించారు. 
 
'సరిలేరు నీకెవ్వరు' వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడికి, హీరో మహేశ్ బాబుకు, ఆదరించిన ప్రేక్షకులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తన నట ప్రస్థానానికి 1979 'కల్లుక్కుల్ ఈరమ్', 'కిలాడి కృష్ణుడు' నుండి 2020 'సరిలేరు నీకెవ్వరు' వరకు ఆగౌరవాన్ని అందించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. 
 
ప్రజా జీవనంలో మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం తనకు కల్పిస్తోందో లేదో తెలియదన్నారు. ఇప్పటికి ఇక శెలవని.. మనసు నిండిన మీ ఆదరణకు, తన ప్రాణప్రదమైన అభిమాన సైన్యానికి ఎప్పటికీ నమస్సులు అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments