Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కింగ్‌డమ్' నుంచి వైల్డ్ పోస్టర్‌ను రిలీజ్ చేసి మేకర్స్

ఠాగూర్
శుక్రవారం, 2 మే 2025 (10:54 IST)
టాలీవుడ్ యంగ్ హీరో విజయే దేవరకొండ తాజాగా నటించిన చిత్రం "కింగ్‌డమ్". జాతీయ అవార్డు గ్రహీత గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. సితార ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇందులో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బొర్సో హీరోయిన్‌గా నటిస్తున్నారు. 
 
ఈ మూవీలో రౌడీ బాయ్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, ఇంటెన్స్ టీటైలి టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి మరో వైల్డ్ పోస్టర్‌‌ను విడుదల చేసింది. 
 
"కింగ్‌డమ్" మాసం పరిపాలించడానికి సిద్ధంగా ఉంది అనే క్యాప్షన్‌తో ఈ సరికొత్త పోస్టర్‌ను మేకర్స్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ చిత్రంపై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ గంపెడాశలు పెట్టుకున్నారు. 
 
ఇటీవలికాలంలో ఆయన నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో మంచి కంటెంట్‌తో వస్తున్న 'కింగ్‌డమ్‌'పై హీరోతో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా ఎన్నో ఆశలుపెట్టుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యను చంపి ఇంట్లో పాతిపెట్టిన భర్త.. తర్వాత భయంతో ఆత్మహత్య!!

ఆత్మాహుతికి నాకొక బాంబు ఇవ్వండి.. పాకిస్థాన్ వెళతా : కర్నాటక మంత్రి (Video)

భారతీయ వంట మనిషిని ఉరితీసిన కువైట్!!

వధువే అసలైన కానుక... రూ.లక్షల కట్నాన్ని సున్నితంగా తిరస్కరించిన వరుడు!!

బాబ్బాబు.. మీకు దణ్ణం పెడతాం.. భారత్ దాడి నుంచి రక్షించండి.. గల్ఫ్ దేశాలకు పాక్ వినతి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments