Webdunia - Bharat's app for daily news and videos

Install App

'శంకరాభరణం' చిత్రం ఎడిటర్ జీజీ కృష్ణారావు కన్నుమూత

Webdunia
మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (12:46 IST)
కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన "శంకరాభరణం" చిత్రానికి ఎడిటర్‌గా పనిచేసిన జీజీ కృష్ణమూర్తి ఇకలేరు. ఆయన మంగళవారం బెంగుళూరులో వృద్దాప్య సమస్యల కారణంగా చనిపోయారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈయన తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్ దర్శకులందరి వద్ద పని చేశారు. ముఖ్యంగా, దాసరి నారాయణ రావు, కె.విశ్వనాథ్‌ వంటి లెజండరీ దర్శకుల సినిమాలకు పని చేశారు.
 
కె.విశ్వనాథ్ రూపొందించిన "శంకరాభరణం", "సాగరసంగమం", "స్వాతిముత్యం", "శుభలేక" వంటి సినిమాలతో ఆయన తెరకెక్కించిన అన్ని చిత్రాలకు ఎడిటర్‌గా పని చేశారు. అలాగే, దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన "బొబ్బిలిపులి", "సర్దార్ పాపారాయుడు" వంటి చిత్రాలతో పాటు దాదాపు 200కి పైగా చిత్రాలకు పని చేశారు. కృష్ణారావు మృతిపట్ల పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈయ
 
కాగా, ఈ నెల రెండో తేదీన కె.విశ్వనాథ్ కన్నుమూశారు. ఆ తర్వాత మూడో తేదీన ప్రముఖ గాయనీమణి వాణీజయరామ్ తుదిశ్వాస విడిచారు. గత శనివారం హీరో తారకరత్న కన్నుమూశారు. ఇపుడు ఎడిటర్ కృష్ణారావు చనిపోయారు. ఇలా వరుస మృతులతో తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. కృష్ణారావు తెలుగులో తన సినీ కెరీర్‌ను పాడవోయి భారతీయుడా అనే చిత్రం ద్వారా మొదలుపెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతర లేక?

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

యూపీలో విచిత్ర ఘటన: 18ఏళ్ల బాలుడితో 30ఏళ్ల యువతి పెళ్లి.. అప్పటికే రెండు వివాహాలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments