Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెపోటుతో కోలీవుడ్ బడా నిర్మాత కన్నుమూత

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2022 (13:31 IST)
తమిళ చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత కె.మురళీధరన్ గురువారం గుండెపోటుతో మరణించారు. ఆయనకు వయసు 65 యేళ్లు. తన కుటుంబ సభ్యులతో కలిసి కుంభకోణం వెళ్లగా అక్కడ గుండెపోటుకు గురై తుదిశ్వాస విడించారు. కోలీవుడ్‌లోని పెద్ద స్టార్లందరితో ఆయన సినిమాలు నిర్మించారు. గత కొంతకాలంగా చిత్ర పరిశ్రమకు దూరమై కుటుంబ సభ్యులతో ఉంటున్నారు. 
 
లక్ష్మీ మూవీ మేకర్స్ బ్యానరుపై ఆయన తమిళంలో 'గోకులంలో సీతై' అనే చిత్రాన్ని నిర్మించగా, అది తెలుగులోకి పవన్ కళ్యాణ్ హీరోగా "గోకులంలో సీత" పేరుతో రీమేక్ చేసారు. తెలుగులో ఈ చిత్రం హక్కులను గీతా ఆర్ట్స్ కొనుగోలు చేసి రీమేక్ చేయగా, పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మంచి చిత్రంగా నిలిచింది. 
 
1994లో సినీ నిర్మాతగా తన తొలి చిత్రాన్ని నిర్మించిన మురళీధరన్.. కమల్ హాసన్‌తో 'అన్బేశివం', విజయకాంత్‌తో 'ఉలవత్తురై', కార్తీక్‌తో 'గోకులత్తిల్ సీతై', అజిత్‌తో 'ఉన్నైతేడి', విజయ్‌తో 'ప్రియముడన్', ధనుష్‌తో 'పుదుప్పేట', సింబుతో 'సిలంబాట్టం' వంటి చిత్రాలు నిర్మించారు. 
 
కాగా, మురళీధరన్ మృతిపట్ల కమల్ హాసన్ తన ప్రగాఢ సంతాన్ని వ్యక్తం చేసారు. ఎన్నో హిట్ చిత్రాలు నిర్మించిన మురళీధరన్ ఇకలేరన్న వార్తను జీర్ణించుకోలేక పోతున్నట్టు చెప్పారు. ప్రియమైన శివ.. ఆ రోజులు నాకు గుర్తుకు వస్తున్నాయి. ఆయనకు నా నివాళులు అంటూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏప్రిల్ 28న గుంటూరు మేయర్ ఎన్నికలు

AP SSC Exam Results: ఏపీ పదవ తరగతి పరీక్షా ఫలితాలు.. బాలికలదే పైచేయి

Pahalgam: వెళ్ళు, మీ మోదీకి చెప్పు.. బాధితుడి భార్యతో ఉగ్రవాదులు

పహల్గామ్ దాడి.. విమానాశ్రయంలోనే ప్రధాని మోడీ ఎమర్జెన్సీ మీటింగ్

పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి ఇతడేనా? ఫోటో రిలీజ్!? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments