ఈ నేపథ్యంలో వెంకీ మల్టీస్టారర్లకే మొగ్గు చూపుతున్నాడట. తాజాగా, దర్శకుడు వీరు పోట్ల వెంకీ కోసం ఓ మల్టీ స్టారర్ కథను సిద్ధం చేసాడట. ఈ చిత్రంలో వెంకీ, రవితేజ కలిసి నటించనున్నారని విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం చర్చల దశలోనే ఉందనీ... త్వరలోనే దీనిపై ఫుల్ క్లారిటీ రానుందనే టాక్లో ప్రస్తుతం టాలీవుడ్లో వినపడుతోంది. మరోవైపు, వెంకీ ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి 'వెంకీ మామ' అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.