బాలకృష్ణ 'వీరసింహారెడ్డి'కి సెన్సార్ పూర్తి - యూఏ సర్టిఫికేట్ మంజూరు

Webdunia
సోమవారం, 9 జనవరి 2023 (20:09 IST)
నటసింహం నందమూరి బాలకృష్ణ - శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం "వీరసింహారెడ్డి". వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. దునియా విజయ్ ప్రతినాయకుడు. గోపీచంద్ మలినేని దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానరుపై నిర్మించారు. ఈ నెల 12వ తేదీన విడుదలకానుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
 
ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు యూఏ సర్టిఫికేట్‌ను మంజూరు చేశారు. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ఇటీవల ఒంగోలు వేదికగా జరిగింది. మరోవైపు, ఈ మూవీ ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. బాలకృష్ణ చెప్పిన డైలాగులు అభిమానలను ఉర్రూతలూగిస్తున్నాయి. సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. కర్నూలు ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డుపై వేగంగా కదిలే స్కూటర్ హ్యాండిల్ వదిలేసి కూర్చుని ఫీట్స్, వీడియో

సినీ రంగంలో తాగుబోతులు, తిరుగుబోతులే వుంటారు: సినీ పరిశ్రమపై పాశం యాదగిరి దారుణ వ్యాఖ్యలు

సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్.. కాంట్రాక్ట్ ఉద్యోగి సేఫ్

విద్యుత్ ట్రాన్స్‌మిషన్ సత్తాపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ AI ఆశలు

సరస్వతి పుష్కరాలకు టీఎస్‌టీడీసీ ప్రత్యేక ప్యాకేజీ పర్యటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు

కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు

శస్త్రచికిత్స లేకుండానే 4 ఏళ్ల చిన్నారి గుండెలో రంధ్రాన్ని విజయవంతంగా మూసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments