Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌‍ ఆ సీన్‌ను పండిస్తే.. శింబు కామెడీతో పగలబడి నవ్వించాడు..

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (12:10 IST)
త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో విడదలై సూపర్ హిట్ అయిన అత్తారింటికి దారేది సినిమా ఇటీవల తమిళంలో రీమేక్ చేయబడింది. 'వందా రాజాదాన్ వరువె' పేరుతో ఫిబ్రవరి 1న తమిళనాడులో విడుదలైన ఈ సినిమాలో శింబు హీరోగా నటించాడు.
 
అత్తారింటికి దారేది సినిమాలో పవన్ అద్భుతమైన నటన కనబరిచాడు. తన కెరీర్‌లోనే చెప్పుకోదగ్గ నటనను ప్రదర్శించాడు. చివరలో రైల్వేస్టేషన్‌లో వచ్చే క్లైమాక్స్ సీన్ ఈ సినిమాకు హైలెట్ అని చెప్పుకోవాలి. ఇందులో పవన్ హావభావాలు, చాలా బాగున్నాయని ప్రశంసలు వెల్లువెత్తాయి.
 
అయితే ఇదే సీన్‌ను శింబు తమిళంలో కామెడీ చేసి పడేసాడు. తెలుగులో ఈ సీన్ వచ్చినప్పుడు ప్రేక్షకులు సీరియస్‌గా చూస్తే, తమిళంలో ఈ సీన్ చూసి ప్రేక్షకులు నవ్వుతున్నారట. ఇందులో అత్తయ్యగా నటించిన రమ్యకృష్ణతో శింబు డైలాగులు చెప్తుంటే జనం కామెడీ సీన్ లెక్క పగలబడి నవ్వుకున్నారట.
 
ఇప్పటికే ఈ సీన్ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీని మీద ట్రోలింగ్స్ కూడా ఎక్కువయ్యాయి. తెలుగు, తమిళ వెర్షన్‌లను కంపేర్ చేస్తూ రూపొందించిన వీడియోలను చూసి జనం నవ్వుకుంటున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్నింగ్ వాక్ నుంచి మ్యారేజ్ వరకు.. 60 యేళ్ల వయసులో 51 యేళ్ల మహిళను పెళ్లాడిన దిలీప్ ఘోష్

lady don zikra అరేయ్ గూట్లే... నా బ్రదర్‌ను పొడిచినోడిని లేపేయ్?!: లేడీ డాన్ జిక్రా హస్తం?!!

ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై?

ఈ రాత్రి నా భర్తను చంపేద్దాం.. ఆపై పామును వదిలేద్దాం.. పనైపోతుంది.. ప్రియుడితో..?

వైకాపాలో 2వ స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారు : విజయసాయి రెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments