Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌‍ ఆ సీన్‌ను పండిస్తే.. శింబు కామెడీతో పగలబడి నవ్వించాడు..

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (12:10 IST)
త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో విడదలై సూపర్ హిట్ అయిన అత్తారింటికి దారేది సినిమా ఇటీవల తమిళంలో రీమేక్ చేయబడింది. 'వందా రాజాదాన్ వరువె' పేరుతో ఫిబ్రవరి 1న తమిళనాడులో విడుదలైన ఈ సినిమాలో శింబు హీరోగా నటించాడు.
 
అత్తారింటికి దారేది సినిమాలో పవన్ అద్భుతమైన నటన కనబరిచాడు. తన కెరీర్‌లోనే చెప్పుకోదగ్గ నటనను ప్రదర్శించాడు. చివరలో రైల్వేస్టేషన్‌లో వచ్చే క్లైమాక్స్ సీన్ ఈ సినిమాకు హైలెట్ అని చెప్పుకోవాలి. ఇందులో పవన్ హావభావాలు, చాలా బాగున్నాయని ప్రశంసలు వెల్లువెత్తాయి.
 
అయితే ఇదే సీన్‌ను శింబు తమిళంలో కామెడీ చేసి పడేసాడు. తెలుగులో ఈ సీన్ వచ్చినప్పుడు ప్రేక్షకులు సీరియస్‌గా చూస్తే, తమిళంలో ఈ సీన్ చూసి ప్రేక్షకులు నవ్వుతున్నారట. ఇందులో అత్తయ్యగా నటించిన రమ్యకృష్ణతో శింబు డైలాగులు చెప్తుంటే జనం కామెడీ సీన్ లెక్క పగలబడి నవ్వుకున్నారట.
 
ఇప్పటికే ఈ సీన్ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీని మీద ట్రోలింగ్స్ కూడా ఎక్కువయ్యాయి. తెలుగు, తమిళ వెర్షన్‌లను కంపేర్ చేస్తూ రూపొందించిన వీడియోలను చూసి జనం నవ్వుకుంటున్నారట.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments