Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్‌ను కలిసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబసభ్యులు... ఎందుకు?

Webdunia
గురువారం, 29 ఆగస్టు 2019 (14:12 IST)
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి. రేనాటి వీరుడు, తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.
 
ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇకపోతే నేడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి కుటుంబ సభ్యులు మెగాస్టార్ చిరంజీవి గారిని ఆయన స్వగృహంలో కలిసి ఆనందంగా ముచ్చటించడం జరిగింది. సైరా చిత్రం ద్వారా నరసింహారెడ్డి గారి కుటుంబసభ్యులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని మెగాస్టార్ అన్నారు. 
 
ఇక వారితో కలిసి మెగాస్టార్ దిగిన ఫోటో కాసేపటి క్రితం సోషల్ మీడియా మాధ్యమాల్లో రిలీజ్ అయి, విపరీతంగా వైరల్ అవుతోంది. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, సైరాను అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments