Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి, నాగార్జునతో కేంద్రమంత్రి అనురాంగ్‌ సింగ్‌ ఠాకూర్‌ చర్చ సినిమాకేనా!

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (11:55 IST)
Chiranjeevi, Nagarjuna, Anurang Singh Thakur, Allu Aravind
మెగాస్టార్‌ చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్‌లతో కేంద్ర సమాచారం, బ్రాడ్‌కాస్టింగ్‌ శాఖ, యువజన వ్యవహారాల శాఖా మంత్రి అనురాంగ్‌ సింగ్‌ ఠాకూర్‌ భేటీ అయ్యారు. ఈ విషయాన్ని చిరంజీవి తన సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఠాగూర్‌ను వారు సన్మానించారు. ప్రియమైన శ్రీ ఠాకూర్‌ గారికి ధన్యవాదాలు. నిన్న మీ హైదరాబాద్ పర్యటనలో నా దగ్గరికి రావడానికి సమయం కేటాయించినందుకు. నా సోదరుడి (నాగార్జున) తో కలిసి భారతీయ చలనచిత్ర పరిశ్రమ మరియు అది వేగవంతమైన పురోగతి గురించి!మేము చేసిన సంతోషకరమైన చర్చ నచ్చింది అని ట్వీట్ చేసారు. 
 
Chiranjeevi, Nagarjuna, Thakur
ఇప్పటికే తెలుగు సినిమా ఖ్యాతి ఖండాతరాలకు వ్యాపించడం, ఆస్కార్‌ నామినివరకు వెళ్ళడం, చిరు కుమారుడు రామ్‌చరణ్‌కు ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వడం వంటి సంఘటనలు జరిగిన నేపథ్యంలో ఠాగూర్‌ రాక ఆసక్తిగా మారింది. 
 
కాగా, భారతీయ చలనచిత్రరంగం పురోగతిని గురించి చర్చించినట్లుగా చిరంజీవి ట్వీట్‌ను బట్టి తెలుస్తోంది. దానితోపాటు రాబోయే రాజకీయ పరిణామల గురించి కూడా చర్చ జరిగి వుండవచ్చని ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో చిరంజీవి బిజెపిలో ప్రవేశిస్తారనే టాక్‌ కూడా వుంది. కానీ ఆయన ఆ తర్వాత పవన్‌ పార్టీలోనే ఉంటా అంటూ ప్రకటించారు. మరి పవన్‌ కూడా బిజెపితో సన్నిహితంగా వుండడం అందరికీ తెలిసిందే.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments