Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయభాను రోజుకి రూ.2 లక్షలు కావాలట.. బిగ్‌బాస్-3లో..?

Webdunia
బుధవారం, 24 ఏప్రియల్ 2019 (18:39 IST)
ఒకప్పుడు యాంకర్‌గా, నటిగా బుల్లితెరలో ఓ వెలుగు వెలిగిన ఉదయభాను, అప్పుడప్పుడూ వెండితెరపై కూడా మెరిసింది. ఆ తర్వాత పెళ్లై పిల్లలు పుట్టాక కాస్త విరామం తీసుకుంది. ఇప్పుడు మళ్లీ బుల్లితెరపై సందడి చేయడానికి భాను రెడీ అయిపోతోంది. అందులోనూ స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే బిగ్‌బాస్ షోలో పాల్గొననుందని సమాచారం. 
 
అందుకే బిగ్‌బాస్ సీజన్ 3కి వినిపిస్తున్న కంటెస్టెంట్‌ల పేర్ల లిస్టులో భాను పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కంటెస్టెంట్‌లు వీక్‌గా ఉంటే కార్యక్రమం బోర్ కొడుతుంది. అందుకే స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ల కోసం ఎంత మొత్తాన్నైనా చెల్లించి వారిని అందులో పాల్గొనేలా చేయాలని స్టార్ మా భావిస్తోంది.
 
ఉదయభాను ప్రస్తుతం ఫామ్‌లో లేకపోయినా ప్రేక్షకులు తనని రిసీవ్ చేసుకుంటారనే ఉద్దేశంతో రోజుకి రూ.2 లక్షలు ఇచ్చి మరీ ఆమెను తీసుకుంటున్నారట షో నిర్వాహకులు. అంటే వందరోజులకు గానూ రోజుకి రూ.2లక్షల చొప్పున రూ.2 కోట్లు చెల్లించేందుకు డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. 
 
బిగ్‌బాస్ సీజన్‌లో ఇదే అత్యధిక పారితోషికం అని గుసగుసలు వినిపిస్తున్నాయి. మిగిలిన కంటెస్టెంట్‌లు సైతం ఉదయభాను మాదిరిగానే ఎక్కువ మొత్తాన్ని ఆశిస్తే షో నిర్వాహకులు ఏమి చేస్తారని ప్రేక్షకులు చెవులుకొరుక్కుంటున్నారు.

సంబంధిత వార్తలు

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments