Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్రహీరోల అభిమానుల మధ్య ట్విట్టర్ వార్

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (16:26 IST)
తెలుగు, తమిళ చిత్రపరిశ్రమకు చెందిన ఇద్దరు అగ్ర హీరోల మధ్య ట్విట్టర్ యుద్ధమొదలైంది. ఈ నెల 14వ తేదీన హీరో మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రం మొదటి పాట విడుదల కానుంది. అదే రోజున తమిళ హీరో విజయ్ నటించిన "బీస్ట్" సింగిల్ కూడా విడుదలకానుంది. దీంతో తమతమ హీరోల పాటను సంతోషంగా ఆలకించాల్సిన ఈ ఇద్దరు హీరోల అభిమానులు ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధానికి దిగారు. 
 
యూట్యూబ్‌లో 'బీస్ట్‌' ట్రాక్స్ లైక్స్‌ను పెంచడానికి విజయ్ అభిమానులు బాట్స్‌ను ఉపయోగిస్తారని, మహేష్ ఫ్యాన్స్ ఆరోపించారు. దాంతో విజయ్ అభిమానులు మహేష్ ఫ్యాన్స్ ఫౌల్ క్రై చేస్తున్నారంటూ దండయాత్ర ప్రారంభించారు. ఈ ఇద్దరి ఫ్యాన్స్ మధ్య ట్వీట్ వార్ తీవ్రరూపం దాల్చి ఆపై నెగెటివ్ ట్రెండ్స్‌తో దాడి మొదలుపెట్టారు. 
 
నిజానికి ఈ రెండు సినిమాల పాటలు వినడానికి ఇంకా సమయం ఉంది. అయితే ఇరువురు హీరోల అభిమానులు మాత్రం ఇలా ట్విట్టర్‌లో మాటల యుద్ధం చేసుకోవడం గమనార్హం. కాగా, గతంలో హీరో విజయ్ అనేక తెలుగు చిత్రాలను రీమేక్ చేసి స్టార్ హీరో రేంజ్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తర తెలంగాణాలో దంచికొట్టనున్న వర్షాలు...

Pawan Kalyan: జనసేన ప్రాంతీయ పార్టీగా ఉండాలని నేను కోరుకోవడం లేదు- పవన్ కల్యాణ్

బూట్లలో దూరిన పాము కాటుతో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్

Roja: ఆడుదాం ఆంధ్ర కుంభకోణం.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

కన్నబిడ్డ నామకరణానికి ఏర్పాట్లు... అంతలోనే తండ్రి హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments