Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాగమాధురి నల్లపూసల గొలుసు కనబడలేదు.. ఫిర్యాదు చేస్తే.. దాడి జరిగింది..

Webdunia
బుధవారం, 19 జూన్ 2019 (11:59 IST)
బుల్లితెర నటి రాగమాధురిపై దాడి జరిగింది. నల్లపూసల గొలుసు కనబడలేదని అనుమానం వ్యక్తం చేస్తూ.. రాగమాధురి ఆమె హెయిర్ డ్రెసర్ జ్యోతికపై ఫిర్యాదు చేయడమే ఈ దాడికి కారణమైంది.


వివరాల్లోకి వెళితే.. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 13 లోని లక్ష్మీపార్వతి నివాసం వద్ద తెలుగు సీరియల్ షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా రాగమాధురి నల్లపూసల గొలుసు కనిపించకుండా పోయిందని.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఈ విషయమై సెట్‌లోని సభ్యులను ఆమె ఆరా తీసినప్పటికి ఫలితం లేకుండా పోయింది. ఈ ఫిర్యాదులో హెయిర్ డ్రెసర్ జ్యోతితో పాటు మరో ఇద్దరిపై అనుమానం వ్యక్తం చేస్తూ తన ఫిర్యాదులో పేర్కొంది రాగ మాధురి
 
ఈ ఫిర్యాదు మేరకు జ్యోతికను విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో పోయిన గొలుసు కారులో దొరికిందంటూ సెట్‌లోని వారు ఆ గొలుసును పోలీసులకు అప్పగించి పోలీస్ స్టేషన్ నుంచి జ్యోతికను తీసుకెళ్లారు. 
 
ఈ ఘటనతో ఆగ్రహం చెందిన జ్యోతిక, తన అనుచరులు ఎనిమిది మందితో కలిసి షూటింగ్ జరుగుతున్న ప్రదేశం వద్దకు వెళ్లి రాగమాధురిపై దాడికి పాల్పడింది. దీంతో రాగ మాధురి ఫిర్యాదు మేరకు జ్యోతిక, ఆమె అనుచరులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments