Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాగమాధురి నల్లపూసల గొలుసు కనబడలేదు.. ఫిర్యాదు చేస్తే.. దాడి జరిగింది..

Webdunia
బుధవారం, 19 జూన్ 2019 (11:59 IST)
బుల్లితెర నటి రాగమాధురిపై దాడి జరిగింది. నల్లపూసల గొలుసు కనబడలేదని అనుమానం వ్యక్తం చేస్తూ.. రాగమాధురి ఆమె హెయిర్ డ్రెసర్ జ్యోతికపై ఫిర్యాదు చేయడమే ఈ దాడికి కారణమైంది.


వివరాల్లోకి వెళితే.. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 13 లోని లక్ష్మీపార్వతి నివాసం వద్ద తెలుగు సీరియల్ షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా రాగమాధురి నల్లపూసల గొలుసు కనిపించకుండా పోయిందని.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఈ విషయమై సెట్‌లోని సభ్యులను ఆమె ఆరా తీసినప్పటికి ఫలితం లేకుండా పోయింది. ఈ ఫిర్యాదులో హెయిర్ డ్రెసర్ జ్యోతితో పాటు మరో ఇద్దరిపై అనుమానం వ్యక్తం చేస్తూ తన ఫిర్యాదులో పేర్కొంది రాగ మాధురి
 
ఈ ఫిర్యాదు మేరకు జ్యోతికను విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో పోయిన గొలుసు కారులో దొరికిందంటూ సెట్‌లోని వారు ఆ గొలుసును పోలీసులకు అప్పగించి పోలీస్ స్టేషన్ నుంచి జ్యోతికను తీసుకెళ్లారు. 
 
ఈ ఘటనతో ఆగ్రహం చెందిన జ్యోతిక, తన అనుచరులు ఎనిమిది మందితో కలిసి షూటింగ్ జరుగుతున్న ప్రదేశం వద్దకు వెళ్లి రాగమాధురిపై దాడికి పాల్పడింది. దీంతో రాగ మాధురి ఫిర్యాదు మేరకు జ్యోతిక, ఆమె అనుచరులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments